ఎమ్మెల్యే భూమన స్టైలే వేరు, కరోనాపై వినూత్నంగా అవగాహన.. ఏం చేశారంటే..
ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గుర్తొన్నారు కదా.. అదే, మన తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే.. ఆయనం ఏం చేసినా కాస్త విభిన్నంగా చేస్తుంటారు. వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మినబంటు భూమన. గతంలో వైఎస్ఆర్ కూడా భూమను ప్రయారిటీ ఇచ్చారు. కీలకమైన టీటీడీ చైర్మన్ పదవీని కూడా కట్టెబట్టారు. ఆ సమయంలో దళిత గోవిందం పేరుతో భూమన చాలా హడావిడి చేశారు. తర్వాత కాస్త సైలంట్ అయినా.. మళ్లీ మరోసారి వినూత్నంగా ఆలోచన చేశారు. అదేంటో లుక్కేద్దాం పదండి.
కరోనా వైరస్ జడలువిప్పి నాట్యం చేస్తోంది. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేదు. అందరినీ వైరస్ వణికిస్తోంది. దీనిపై పలువురు అవగాహన కల్పిస్తోన్న పెద్దగా ప్రయోజనం లేదు. కానీ తిరుపతి ఎమ్మెల్యే భూమన.. కొత్తగా ముందుకొచ్చారు. మావన వికాస వేదిక నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒకవైపు చితిమంట, మరోవైపు పుర్రెలో మధ్యలో నిలబడి కనిపించారు. ఆ ఫోటోలు తీసి.. వీడియాకు అందజేయడంతో వైరలవుతోన్నాయి.
కరోనా వైరస్పై అవగాహన కల్పించేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నానని భూమన తెలిపారు. కరోనా వైరస్ వచ్చిన వారంటే ప్రజలు భయపడిపోతున్నారని గుర్తుచేశారు. వారికి ఉన్న అపోహ తొలగించే ప్రయత్నమే ఇదీ అని పేర్కొన్నారు.
వైరస్తో చనిపోయిన వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని భూమన సూచించారు. ప్రజల్లో ధైర్యం కల్పించేందుకు తనవంతుగా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. మరీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపుకు ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.