నగరిలో బైక్ అంబులెన్స్ నడిపిన వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా(వీడియో)
చిత్తూరు:
కరోనా
మహమ్మారి
వ్యాప్తి
నేపథ్యంలో
ఎమ్మెల్యే
ఆర్కే
రోజా
తన
నగరి
నియోజకవర్గంలో
రెండు
బైక్
అంబులెన్స్లను
ప్రారంభించారు.
నగరి,
పుత్తూరు
ప్రభుత్వ
ఆస్పతరులకు
చెరొకటి
చొప్పున
బైక్
అంబులెన్స్లను
అందజేశారు.
ఈ
సందర్భంగా
రోజా
స్వయంగా
బైక్
అంబులెన్స్ను
నడిపి
సందడి
చేశారు.
బైక్ అంబులెన్స్పై సందడి
రోజా
స్వయంగా
బైక్
అంబులెన్స్
నడపడంతో
అభిమానులు
హర్షం
వ్యక్తం
చేశారు.
ఈ
బైక్
అంబులెన్స్లను
శ్రీ
సిటీ
హీరో
మోటార్స్
కంపెనీ
తయారు
చేసి
అందజేసింది.
ఎమ్మెల్యే
రోజా
కోరిక
మేరకు
కంపెనీవారు
బైక్
అంబులెన్స్లను
తయారుచేసి
అందించారు.
హీరో మోటార్స్ రోజా ధన్యవాదాలు
ఈ సందర్భంగా బైక్ అంబులెన్స్లు అందజేసిన హీరో మోటార్స్కు రోజా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మెడికల్ ఆఫీసర్లు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, పట్టణ ముఖ్య నాయకులు, హీరో మోటార్స్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
చిత్తూరులో కరోనా కేసులు ఎక్కువే..
కాగా,
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
గత
24
గంటల్లో
10,794
మంది
కరోనా
సోకగా,
11,918
మంది
కోలుకున్నారు.
70
మందిమరణించారు.
కొత్త
కరోనా
కేసులకంటే
కొత్తగా
డిశ్చార్జ్
అయిన
వారి
సంఖ్య
ఎక్కువగా
ఉండటం
గమనార్హం.
రాష్ట్రంలో
ఇప్పటి
వరకు
4,98,125
కరోనా
పాజిటివ్
కేసులు
నమోదయ్యాయి.
99,689
యాక్టివ్
కేసులున్నాయి.
3,94,019
మంది
కరోనా
నుంచి
కోలుకున్నారు.
4,417
మంది
కరోనా
బారినపడి
మరణించారు.
ఇక
చిత్తూరు
జిల్లాలో
గత
24
గంటల్లో
927
కరోనా
పాజిటివ్
కేసులు
నమోదు
కాగా,
953
మంది
కోలుకున్నారు.
9
మంది
మరణించారు.
జిల్లాలో
ఇప్పటి
వరకు
42,561
కరోనా
పాజిటివ్
కేసులు
నమోదయ్యాయి.
8,979
యాక్టివ్
కేసులున్నాయి.
33,109
మంది
కరోనా
నుంచి
కోలుకున్నారు.
జిల్లాలో
ఇప్పటి
వరకు
473
మంది
కరోనా
బారినపడి
మరణించారు.