మహిళలకు తప్పని వేధింపులు.. జగన్ సర్కార్పై లోకేశ్ నిప్పులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రజలకు రక్షణ లేదని విరుచుకుపడ్డారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్వీట్ చేశారు. వైసీపీ నేతలు కొందరు గుండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నేతలే వేధిస్తే ఇక సమస్యలను ఎవరికీ చెప్పుకోవాలని అడిగారు. సామాన్యుడి గోడు ఆలకించేది ఎవరూ అని నిలదీశారు.
వైసీపీ సర్కార్పై నారా లోకేష్ మరోసారి ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి ప్రజల రక్షణను గాలికొదిలేశారని ఆరోపించారు. అనపర్తి ఎమ్మెల్యే వేధించడం వల్ల మహిళ బలయిపోయిందని చెప్పారు. ఇక సామాన్యుల సంగతి ఏంటీ అని అడిగారు. వైసీపీ నేతలు రాక్షసుల్లా మారి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మహిళ ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
అమరావత రాజధాని మార్పు సహా ితర అంశాలను కూడా నారా లోకేశ్ ప్రస్తావించారు. జగన్ సర్కార్ ఒంటెద్దు పోకడలతో వెళ్తుందని విరుచుకుపడ్డారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఫైరయ్యారు. జనాన్ని వేధించడం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. వీరు చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సమయం వచ్చినప్పుడు బుద్ది చెబుతారని తెలిపారు.