కుప్పం వద్ద హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ - ప్రముఖ జువెలరీ కుటుంబానికి తప్పిన ముప్పు
చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో తమిళనాడు భూభాగంలోని పంట పొలాల్లో ఓ హెలికాప్టర్ దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన ప్రఖ్యాత ఎస్వీఎన్ జ్యుయెలరీ సంస్థల అధినేత శ్రీనివాసన్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతుండగా.. భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
మీసా భారతి ఎక్కడ? ఎన్నికల ప్రచారంలో కనిపించని లాలూ తనయ - తేజస్వీ ఇమేజ్ కోసమేనా?
కోయంబత్తూరు నుంచి తిరుపతి వెళుతోన్న హెలికాప్టర్.. కుప్పం సమీపంలోకి రాగానే ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది. కుప్పంకు దగ్గరగా ఉన్న తిరుపత్తూరు జిల్లా గగనతలంలో ఉన్నట్టుండి పొగమంచు కమ్మేయడంతో హెలికాప్టర్ ను ముందుకు తీసుకెళ్లేందుకు పైలెట్లు విఫలయత్నాలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరుపత్తూరు జిల్లా నంగిలి వద్ద పొలాల్లో దింపేశారు.
ఈ సంఘటన జరిగినప్పుడు హెలికాప్టర్ లో ఇద్దరు పైలట్లు, శ్రీనివాసన్ సహా ఆయన కుటుంబీకులు కలిపి మొత్తం ఏడుగురు ఉన్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగే అయినప్పటికీ హెలికాప్టర్ సురక్షితంగా కిందికి దిగడంతో ప్రమాదం తప్పింది. పంటపొలాల్లో విమానం దిగిన దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో రికార్డు చేశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు.
జగన్ సర్కారు అరుదైన రికార్డు - ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు- చైర్మన్లు ఎవరో తెలుసా?
వాతావరణం అనుకూలించని కారణంగానే హెలికాప్టర్ అత్యవసరంగా దించేశామన్నపైలట్లు.. వాహనంలో ఎలాంటి టెక్నికల్ సమస్యలు తలెత్తలేదని పోలీసులకు వివరించారు. కొన్ని నిమిషాల తర్వాత వాతావరణం కుదుట పడడంతో హెలికాప్టర్ తిరిగి గాల్లోకి లేచి తిరుపతి దిశగా పయనమైంది.
Due to bad weather a chopper landed in fields in Kuppam of Chittoor. The helicopter destined to Tirupati from Coimbatore. All on board safe #Andhrapradesh pic.twitter.com/5vq3dXsWAn
— Sudhakar Udumula (@sudhakarudumula) October 18, 2020