చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క‌న్నాకు రోజా పంచ్‌: చ‌ంద్రబాబు పారిపోయారు: అచ్చెన్నా..బుచ్చ‌న్నా..గుర్తుకొస్తున్నాయా..!

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు..అదే విధంగా టీడీపీ నేత‌ల మీద కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. వైసీపీ నేత లు దాడులు ఎక్కువ‌గా ఉన్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మీద పంచ్‌లు వేసారు. క‌న్నా మీద గ‌తంలో టీడీపీ శ్రేణులు దాడుల‌కు ప్ర‌య‌త్నించిన తీరు..అదే విధంగా బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా మీద దాడికి ప్ర‌య‌త్నించిన తీరు మ‌ర్చిపోయిన‌ట్లు ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. స‌భ‌లో బ‌డ్జెట్ మీద మాట్లాడేందుకు అంశం లేక చంద్ర‌బాబు పారిపోయార‌ని విమ‌ర్శించారు. అచ్చెన్నాయుడు..బుచ్చ‌య్య చౌద‌రి గ‌త అసెంబ్లీలో వ్య‌వ‌హ‌రించి తీరు మ‌ర్చిపోయిన‌ట్లున్నార‌ని..వారి భాష‌ను ప్ర‌జ‌లు అస‌హ్యించుకున్నార‌ని పేర్కొన్నారు.

క‌న్నా మ‌ర్చిపోయిన‌ట్లున్నారు...

క‌న్నా మ‌ర్చిపోయిన‌ట్లున్నారు...

వైసీపీ ఎమ్మెల్యే రోజా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తాజాగా చేసిన వ్యాఖ్య‌ల మీద స్పందించారు. వై సీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత క్షేత్ర స్థాయిలో దాడులు పెరిగాయంటూ క‌న్నా తాజాగా విమ‌ర్శించారు. దీని పైన స్పందించిన రోజా టీడీపీ హ‌యాంలో జ‌రిగిన ప‌రిణామాల‌ను మ‌ర్చిపోయిన‌ట్లున్నార‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉండ‌గానే..రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మీద‌..అదే విధంగా బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా మీద దాడికి ప్ర‌య‌త్నించిన అంశాల‌ను మ‌ర్చిపోయారా అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు టీడీపీ నేత‌లు బీజేపీ లోకి వ‌స్తుండ‌టంతో..ఇక వైసీపీనే లక్ష్యంగా చేసుకొనే విమ‌ర్శ‌లు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్ర‌భుత్వం లో లా అండ్ ఆర్డ‌ర్ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సీఎం జ‌గ‌న్ ఉన్న‌తాధికారుల‌కు స్ప‌ష్టంగా ఆదేశాలు ఇచ్చార‌ని రోజా స్ప‌ష్టం చేసారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో మిన‌హా...క‌క్ష్య పూరిత దాడులు వైసీపీ శ్రేణులు ఎక్క‌డా చేయ‌టం లేద‌ని రోజా వివ‌రించారు.

చంద్ర‌బాబు పారిపోయారు..

చంద్ర‌బాబు పారిపోయారు..

పాద‌యాత్ర స‌మ‌యంలో ఇచ్చిన హామీల అమ‌లు దిశ‌గా తొలి బ‌డ్జెట్‌లోనే అన్ని హామీలు అమ‌లు చేసార‌ని రోజా పేర్కొన్నారు. చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత హోదాలో బ‌డ్జెట్ మీద మాట్లాడాల్సి ఉన్నా..స‌రిగ్గా అదే స‌మ‌యానికి ఆయ‌న పారిపోయార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న స్థానంలో బుచ్చ‌య్య చౌద‌రి తో మాట్లాడించార‌ని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్ల పాలన ప్రజలకు నచ్చలేదు కాబట్టే ప్రజలు జగన్ కు అధికారాన్ని ఇచ్చారని, ఓటని కారణంగా వచ్చిన ఫ్రస్ట్రేషన్ నుంచి ఇంకా బయటపడలేని తెలుగుదేశం నేతలు, ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తూ, సభలో సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో తెలుగుదేశం నేతలు ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు ఛీకొట్టేలా ఉందని విమ‌ర్శిం చారు. ఇప్పుడు చంద్రబాబు సభా సంప్రదాయాలను గురించి మాట్లాడుతూ ఉండటం హాస్యాస్పదంగా ఉందని రోజా ప్ర‌తిప‌క్ష నేత మీద ఫైర్ అయ్యారు.

అచ్చెన్నాయుడు నాడు ఏమ‌న్నారంటే..

అచ్చెన్నాయుడు నాడు ఏమ‌న్నారంటే..

టీడీపీ ప్ర‌భుత్వంలో శాస‌న‌స‌భ‌లో నాడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ప్ర‌వ‌ర్తించిన తీరు గురించి రోజా సీరియ‌స్ కామెంట్స్ చేసారు. తమను రౌడీలని, గూండాలని బెదిరించిన రోజులు ఇంకా గుర్తున్నాయని, కావాలంటే వాటి క్లిప్పిం గ్స్ వేసి చూపిస్తామని తెలిపారు. తాను ఓ మహిళా ఎమ్మెల్యేనన్న గౌరవం కూడా ఇవ్వకుండా గత అసెంబ్లీలో తెలుగు దేశం నేతలు ఎలా మాట్లాడారన్న రికార్డులు ఉన్నాయని అన్నారు. అచ్చెన్నాయుడి తీరును చూసి రాష్ట్రమంతా అస హ్యించుకుంటోందని రోజా ఫైర్ అయ్యారు. నాడు వ‌న‌జాక్షి మీద దాడి చేస్తే విప్‌గా ఉన్న చింత‌మ‌నేని మీద చ‌ర్య‌లు తీసుకోలేద‌ని గుర్తు చేసారు. అచ్చెన్నాయుడు నాడు జ‌గ‌న్ ఉద్దేశించి నీవు మ‌గాడివైతే..మ‌గ‌త‌నం ఉంటే..నీలో సీమ ర‌క్తం ఉంటే..అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఎవ‌రూ మ‌ర్చిపోరాని రోజా సీరియ‌స్‌గా స్పందించారు.

English summary
YCP MLA Roja serious comments on Chandra babu and party leaders. Roja also answered BJP State president Kanna Lakhsmi Narayana comments on YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X