టీడీపీ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థత..చెన్నైలో చికిత్స!
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు లోక్ సభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారం. ఆందోళన చెందాల్సిన పని లేదని డాక్టర్లు వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
నిన్న మోడీ..నేడు అమిత్ షా: దీదీ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్టేనా?
శివప్రసాద్ కొద్దిరోజులుగా మూత్ర పిండాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇటీవలే ఆయనకు చెన్నైలో చికిత్స చేయించారు. సుమారు రెండు వారాల పాటు ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా మరోసారి మూత్ర పిండాల్లో సమస్యలు తలెత్తినట్లు సమాచారం.
దీనితో ఆయనను అప్పటికప్పుడు మరోసారి చెన్నై ఆసుపత్రికే తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. త్వరలోనే డిశ్చార్జి అవుతారని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. డయాలసిస్ చేయించాల్సి వస్తే.. మరి కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి రావచ్చని అంటున్నారు. శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితులపై ఆందోళన చెందొద్దని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు.