తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ అభ్యర్థి భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తునకు సిట్: నిజాలు నిగ్గు తేల్చేలా

|
Google Oneindia TeluguNews

కాకినాడ: రాష్ట్రంలో సంచలనం రేపిన తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో గొల్లలగుంట ఘటనపై జగన్ సర్కార్ స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయదలిచిన సబ్బెళ్ల పుష్పవతి భర్త శ్రీనివాస్ రెడ్డి కిడ్నాప్.. అనంతరం ఆయన ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించిన ఘటనల వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉందంటూ తెలుగుదేశం నేతలు విమర్శిస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కళ్ల ముందే కుప్పకూలిన స్టేజీ: రాకేష్ తికాయత్ సహా: తృటిలో తప్పిన ప్రాణాపాయంకళ్ల ముందే కుప్పకూలిన స్టేజీ: రాకేష్ తికాయత్ సహా: తృటిలో తప్పిన ప్రాణాపాయం

Recommended Video

#Eastgodavari టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భర్త మృతి కేసులో సిట్ విచారణ

టీడీపీ అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాస్ రెడ్డి గొల్లలగుంటలో ఆత్మహత్యకు చేసుకున్న విషయం తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులు ఆయనను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నేతలు విమర్శించారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా గొల్లలగుంటకు వెళ్లారు. శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్సార్సీపీ.. తమ పార్టీ నేతలను చూసి వణికిపోతోందని, భయాందోళనలకు గురి చేస్తోందంటూ నారా లోకేష్ విమర్శించారు.

AP govt appoints Sit to investigate East Godavari incident

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా గొల్లలగుంటకు వెళ్లారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ శ్రీనివాస్ రెడ్డి గానీ, ఆయన భార్య పుష్పవతి గానీ పోలీసులు ఫిర్యాదు చేయకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొందరు వ్యక్తులు తనకు మత్తు మందు ఇచ్చారని, కాళ్లు, చేతులు కట్టేసి ఊరికి దూరంగా వదిలి పెట్టారంటూ శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఆయన కాండ్రేగుల గ్రామం శివార్లలో పొలంలో ఉరి వేసుకొన్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు. ఈ ఘటన పట్లు పలు అనుమానాలు వ్యక్తమౌతోండటం, తెలుగదేశం పార్టీ రాజకీయ అస్త్రంగా మార్చుకోవడంతో ప్రభుత్వం విచారణ చేపట్టాలని నిర్ణయించింది. సిట్‌ను ఏర్పాటు చేసింది. డీఎస్పీ నలుగురు సభ్యులతో సిట్ ఏర్పాటైంది.

AP govt appoints Sit to investigate East Godavari incident

కళ్ల ముందే కుప్పకూలిన స్టేజీ: రాకేష్ తికాయత్ సహా: తృటిలో తప్పిన ప్రాణాపాయంకళ్ల ముందే కుప్పకూలిన స్టేజీ: రాకేష్ తికాయత్ సహా: తృటిలో తప్పిన ప్రాణాపాయం

English summary
AP government appoints Special Investigation Team to investigate the death of TDP leader Srinivas Reddy in Gollalagunta Panchayat in Jaggampet Assembly constituency in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X