తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికల ప్రకటనకు జాప్యం వద్దు .. వెంటనే నిర్వహించండి : ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామ లేఖ

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను దశలవారీగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా నిర్వహించాలంటూ పట్టుబట్టిన అధికార వైసిపి, ఇప్పుడు ఎన్నికలను కరోనా నేపథ్యంలో పోస్ట్ పోన్ చేయాలని భావిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఉన్న వివాదాల కారణంగా ప్రభుత్వం ఇప్పట్లో ఎన్నికలకు వెళ్ళటం మంచిది కాదని అభిప్రాయపడుతుంది .

వైఎస్ జగన్ చేతిలో రాష్ట్ర పాలన..పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్న చంద్రబాబువైఎస్ జగన్ చేతిలో రాష్ట్ర పాలన..పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్న చంద్రబాబు

 ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రగడ.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రగడ.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం రగడ కొనసాగుతోంది.

కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాలేదని, ఈ సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం సరికాదంటూ సీఎస్ నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాయడం , దానిపై నిమ్మగడ్డ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో మీ జోక్యం ఏమిటి అంటూ ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది.

 ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై లేఖ రాసిన రఘురామ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై లేఖ రాసిన రఘురామ

ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని రఘురామకృష్ణంరాజు ఎన్నికల కమిషన్ ను కోరారు . దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిందని, పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన ఏపీలోనూ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Recommended Video

భారత్ లో చొరబాటుకు పాక్ యత్నం..పాక్ డ్రోన్ ను ధ్వంసం చేసిన భారత ఆర్మీ!! | Oneindia Telugu
స్కూల్స్ కు ఓకే కానీ ఎన్నికలకు కాదా ? రఘురామ ప్రశ్న

స్కూల్స్ కు ఓకే కానీ ఎన్నికలకు కాదా ? రఘురామ ప్రశ్న

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన రఘురామ రాష్ట్రంలో ఇసుక విధానం దోపిడీకి తెరలేపినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. అంతేకాదు మాన్సస్ ట్రస్ట్ విషయంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ట్రస్టు ఆస్తుల పరిరక్షణ బాధ్యతను అశోక్ గజపతిరాజుకు అప్పగించాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఇక ఎన్నికల నిర్వహణకు ఎలాంటి జాప్యం లేకుండా ప్రకటన విడుదల చేయాలంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా రఘురామకృష్ణంరాజు స్కూళ్ళు ప్రారంభించిన ప్రభుత్వం కరోనా పేరు చెప్పి ఎన్నికలు ఎలా వాయిదా వేస్తుంది అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం చెబుతున్న కారణం సరైనది కాదంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
Narasapuram MP Raghurama Krishnam Raju has written an interesting letter to the state election commission. Raghuram Krishnam Raju asked the Election Commission to hold local body elections in AP immediately. He said a statement should be issued in this regard. He said in a letter to the state election commission that elections should be held in the AP as well, noting that corona influence was currently declining and elections were being held in neighboring states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X