తూర్పుగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంఫన్ తుఫాన్ వేళ.. తూర్పు గోదావరిలో విచిత్రం.. ఎగబడ్డ జనం..

|
Google Oneindia TeluguNews

తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లిలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతానికి సమీపంలోని కొన్ని ఇళ్లు అలల ధాటికి ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో ఓ ఇంటి గోడల నుంచి వెండి నాణేలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు.

గ్రామంలో సుమారు 8 ఇళ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అందులో ఓ ఇంటి పునాది గోడ కూలిపోవడంతో.. అందులో వెండి నాణేలు బయటపడ్డట్టు చెబుతున్నారు. ఈ నాణేలు బ్రిటీష్ కాలం నాటివి అని అంటున్నారు. అప్పట్లో బొందు అమ్మోరయ్య,ఎల్లమ్మ అనే ధనవంతులైన మత్స్యకార కుటుంబం ఆ ఇంట్లో నివసించేదని.. ఆ సమయంలోనే గోడల్లో వెండి నాణేలు దాచిపెట్టి ఉంటారని అంటున్నారు.

silver coins found in a wall basement after it collapse

Recommended Video

Cyclone Amphan Was Not Hit AP Coastal

నాణేలు దొరికిన చాలామంది విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం. ఎక్కడా పురావస్తు శాఖ వారు తిరిగి వాటిని లాక్కెళ్లిపోతారేమోనన్న భయంతో తమకేమీ తెలియదని చెబుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అంఫన్ తుఫాన్ వేళ తూర్పుగోదావరిలో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశమైంది.

English summary
In a strange incident,silve coins found in a wall basement after it collapse due to amphan cyclone effect on Thursday. Incident took place in Kothapalli village,East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X