నరసాపురంలో జనసేన, బీజేపీ బోణి..
ఆంధ్రప్రదేశ్ తొలి విడత పంచాయతీ ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార వైసీపీ బలపరిచిన అభ్యర్థులే మెజార్టీ చోట్ల గెలుపొందారు. టీడీపీ, బీజేపీ, జనసేన కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపించాయి. నరసాపురం డివిజన్ పంచాయతీ ఎన్నికల్లో విభిన్న ఫలితాలు వెల్లడయ్యాయి. 12 పంచాయతీల సర్పంచ్ ఫలితాలు విడుదల కాగా.. వైసీపీ ఐదు, టీడీపీ మూడు, జనసేన మూడు, బీజేపీ బలపర్చిన అభ్యర్థి ఒకరు గెలిచారు.
నర్సాపురం మండలం రాజుగారితోట, పాత నవరసపురం, మొగల్తూరు మండలం జగన్నాధపురం పంచాయతీలలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. పోడూరు మండలం రావిపాడు సర్పంచ్గా పెనుమత్స విజయలక్ష్మి విజయం సాధించారు.
ఏపీలో మరో రెండు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఇంతలో జడ్పీ ఎన్నికలను కూడా నిర్వహించాలని ఆయన అనుకుంటున్నారు. కానీ దీనిపై అధికార వైసీపీ ఎలాంటి వ్యుహం అనుసరిస్తుందో చూడాలి మరీ. ఇప్పటికే ఎస్ఈసీ వర్సెస్ వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.