ఎండకు బ్లాస్ట్ అయిన అయిల్ ట్యాంకర్ ...
మండుతున్న ఎండలకు మనుష్యులు విలవిలలాడుతున్నారు. బయటకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు తలెత్తాయి. ఎండలకు పక్షులు ,జంతువులు సైతం తల్లడిల్లుతున్నాయి. అయితే ప్రస్థుత ఉష్ణోగ్రతలకు మనుష్యులే కాదు ప్రాణం లేని వాహానాలు సైతం మాడి మసయి పోతున్నాయి. తాజగా గుంటూరు జిల్లా అద్దంకి-జాతీయ రాహదారిపై రోంపిచర్ల మార్కెట్ యార్డు వద్ద ఓ నిలిచి ఉంచిన అయిల్ ట్యాంకర్ మంటలతో కాలిపోయింది.
కాగా ట్యాంకర్ హైద్రబాద్ నుండి చెన్నై వెళుతున్న నేపథ్యంలో విశ్రాంతి కోసం డ్రైవర్ ఓ చెట్టుక్రింద పార్క్ చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలోనే అయిల్ ట్యాంకర్ టైర్లు పేలీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి .దీంతో విశ్రాంతి తీసుకుంటున్న డ్రైవర్ లేచి చూడడంతో మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తు ట్యాంకర్ లో అయిల్ లేదు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ఎండ ధాటికే టైర్లు వేడెక్కి పేలి పోయినట్టు డ్రైవర్ చెబుతున్నాడు.