నాగర్జున సాగర్ విహారంలో విషాదం...లైవ్లో కొట్టుకుపోయిన యువకుడు
వర్షాలు విపరీతంగా కురవడంతో ప్రకృతి రమణియతను ఆస్వాధించేందడంతో పాటు నీటీ ప్రవాహాల్లో తేలియాడేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా మూడు రోజుల పాటు వరుసగా సెలవులు రావడంతో ఈ తాకిడి మరింత పెరిగింది. దీంతో వాటర్ ఫాల్స్ ఏరియాలతో పాటు పలు నదులు, డ్యామ్ల వద్దకు ప్రజలు తండోప తండాలుగా చేరుకుంటున్నారు...మరోవైపు ఎంజాయ్ కోసం పోయిన కుటుంభాల్లో అక్కడక్కడ విషాదం కూడ అలుముకుంటుంది. ఈనేపథ్యంలోనే నాగార్జున సాగర్ వరద జలాల్లో ఓ యువకుడు గల్లంతాయ్యాడు.
హాలీడే కావడంతో నాగార్జున సాగర్కు చేరుకుని సాగర్ శివాయం ఘాట్లో ఈతకు వెళ్లిన ఓ పర్యాటకుడు నీటీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. భారీగా వస్తున్న నీటీ ప్రవాహంలో జహిరాబాద్కు చెందిన నర్సింహ ఈతకు దిగాడు. అయితే విపరీతంగా వస్తున్న ప్రవాహం నేపథ్యంలోనే ఆయన మరింత లోపలికి వెళ్లడంతో బయటికి రాలేకపోయాడు. దీంతో పర్యటకులు చూస్తుండంగానే ఆ యువకుడు నీట మునిగాడు. ఇక అక్కడే ఉన్న స్థానికులు ప్రయత్నించిన బయటకు రాలేకపోయాడు. దీంతో నర్సింహ కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
నాగర్జున సాగర్ విహారంలో విషాదం...లైవ్లో కొట్టుకుపోయిన యువకుడు #NagarjunaSagar #NagarjunaSagarDam #Guntur #AndhraPradesh #Zaheerabad #water pic.twitter.com/kPXUeP7y0h
— Oneindia Telugu (@oneindiatelugu) August 12, 2019