జే ట్యాక్స్ టార్గెట్ 25 వేల కోట్లు: కరోనా వ్యాప్తి నిలయాలుగా వైన్ షాపులు: నారా లోకేశ్ (వీడియో)
ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా రికార్డవుతున్నాయి. గత మూడురోజులుగా రోజు 2 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. దీంతో ఆందోళన నెలకొంది. అయితే వైన్ షాపుల ముందు జనం మాత్రం బారులు తీరారు. సామాజిక దూరం మాట మరచి, కొందరు మాస్క్ ధరించకుండా క్యూ లైన్లో నిల్చొని ఉన్నారు. ఆ వీడియోలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కరోనా విలయ తాండవం చేస్తోన్న సీఎం జగన్ ధన దాహం తీరడం లేదని మండిపడ్డారు.
లోకేశ్ రెండు వీడియోలను ట్వీట్ చేశారు. ఆ రెండు వీడియోల్లోనూ భారీగా జనం ఉన్నారు. కరోనా వైరస్ కేసులు ఇన్ని నమోదవుతన్న కొంచెం కూడా భయపడకుండా క్యూ లైన్లో ఉన్నారు. లిక్కర్ మాఫియా కోరలు చాచిందని లోకేశ్ మండిపడ్డారు. రోజు పదుల సంఖ్యలో జనం చనిపోతున్న వైన్ షాపుల ముందు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం బాధాకరమని ట్వీట్ చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్న జగన్ ధన దాహం తీరడం లేదా అంటూ ధ్వజమెత్తారు.
వైరస్ వేగంగా వ్యాపిస్తోన్న వైన్ షాపుల వద్ద జన సముహం ఏంటీ అని లోకేశ్ ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టి మరీ జే ట్యాక్స్ పైసలు వసూల్ చేస్తుందన్నారు. కనీస జాగ్రత్తలు లేకపోవడంతో మద్యం దుకాణాలు కరోనా వ్యాప్తి నిలయాలుగా మారుతున్నాయని మండిపడ్డారు. జే ట్యాక్స్ మాత్రం రూ.25 వేల కోట్ల టార్గెట్ కోసం మద్యాన్ని ఏరులై పారిస్తోందని ధ్వజమెత్తారు.
.@ysjagan లిక్కర్ మాఫియా కోరలు చాచింది. ఒక పక్క కరోనా బారిన పడి వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రతీ రోజు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా జగన్ రెడ్డి గారి ధన దాహం తీరడం లేదు. (1/2) pic.twitter.com/wpz3M4g1xJ
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 18, 2020
కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో 25 వేల కోట్ల జే ట్యాక్స్ కోసం ప్రజల ప్రాణాలు తాకట్టు పెడుతున్నారు.కరోనా వ్యాప్తి కి నిలయాలుగా మారుతున్న జగన్ మద్యం దుకాణాలు తక్షణం మూసివేయ్యాలి. (2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 18, 2020