న్యూఇయర్ విషాదం: డివైడర్ను ఢీకొన్న కారు, నలుగురు బీటెక్ విద్యార్థులు మృతి
గుంటూరు: జిల్లాలోని లాలూపురం హైవే పైన సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఓ కారు డివైడర్ను ఢీకొట్టడం వల్ల నలుగురు బీటెక్ విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు ఆర్వీఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారని తెలుస్తోంది.
కారులో మొత్తం ఏడుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారు న్యూఇయర్ వేడుకల కోసం ఉత్సాహంగా, కారులో అతివేగంగా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 160 కిలో మీటర్ల వేగంతో ఉన్నారని తెలుస్తోంది. వీరి కారు ముందు వెళ్తున్న ఓ కంటెయినర్ లారీ కూడా ఢీకొట్టింది. అంటే వారు వెళ్తున్న హ్యుండాయ్ కారు వెళ్లి లారీనీ డీకొడితే... ఆ లారీ ముందుకెళ్లి బోల్తా పడింది. వారు అంత వేగంతో వెళ్తున్నారు.
గత పది రోజుల్లో గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం కారణంగా దాదాపు ఇరవై మంది మృతి చెందారు. అతివేగం లేదా చలి-మంచు కారణంగా కావొచ్చు.. ఈ ప్రమాదాలు జరిగాయి. గాయపడ్డ వారికి చికిత్స జరుగుతోంది. కాగా, కారు ఢీకొనగా లారీ బోల్తాపడిన విషయం తెలిసిందే. ఆ లారీ డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నారు.