గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెలగపూడిలో అర్దరాత్రి మరియమ్మ అంత్యక్రియలు .. ఎంపీ సురేష్ పేరు ఎఫ్ఐఆర్ లో చేరుస్తామని హోం మంత్రి హామీ

|
Google Oneindia TeluguNews

రాజధాని గ్రామమైన వెలగపూడిలో ఎస్సీ కాలనీలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తో మరియమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణ కారణంగా రాజధాని గ్రామమైన వెలగపూడిలో ఉద్రిక్త వాతావరణం నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగింది. రోజంతా రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలు, నినాదాలు, బైఠాయింపు లతో రాజధాని గ్రామమైన వెలగపూడి హోరెత్తింది. వెలగపూడి రణరంగాన్ని తలపించింది.

పరిహారం ఇవ్వకుండా అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తాం సీఎం సాబ్‌ .. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పవన్ కళ్యాణ్ అల్టిమేటం పరిహారం ఇవ్వకుండా అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తాం సీఎం సాబ్‌ .. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పవన్ కళ్యాణ్ అల్టిమేటం

 వెలగపూడి ఉద్రిక్తతల నేపధ్యంలో రంగంలోకి దిగిన హోం మంత్రి సుచరిత

వెలగపూడి ఉద్రిక్తతల నేపధ్యంలో రంగంలోకి దిగిన హోం మంత్రి సుచరిత

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నేరుగా హోంమంత్రి రంగంలోకి దిగారు.

ఆదివారం రోజు రాత్రి నుండి చోటు చేసుకున్న వివాదం నిన్న అర్ధరాత్రి వరకు ఉద్రిక్తం గానే ఉంది . మరియమ్మ మృతితో వెలగపూడి గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది .ఈ ఘటనకు ఎంపీ నందిగం సురేష్ ప్రోద్బలం ఉందని, ఆయనపై కేసు నమోదు చేయాలని బాధితులు ఆందోళన చేశారు. మరియమ్మ మృతదేహాన్ని పెట్టుకొని అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో హోం మంత్రి సుచరిత రంగంలోకి దిగి అర్ధరాత్రి ఎస్సీ సంఘాలతో చర్చలు జరిపారు

వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

ఎంపీ నందిగం సురేష్ పేరును ఎఫ్ఐఆర్లో చేరుస్తామని హోం మంత్రి హామీ

ఎంపీ నందిగం సురేష్ పేరును ఎఫ్ఐఆర్లో చేరుస్తామని హోం మంత్రి హామీ

ఎంపీ సురేష్ పేరును ఎఫ్ఐఆర్లో చేరుస్తామని హోం మంత్రి హామీ ఇవ్వడంతో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మరియమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఎస్సీ కాలనీలో ఆర్చి నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారగా 50 సంవత్సరాల మరియమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలోని ఎస్సీ కాలనీ లో కొత్తగా వేసిన సిమెంట్ రహదారి ప్రారంభంలో ఆర్చి నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం కాలనీవాసులు మధ్య చిచ్చు పెట్టింది. ఆర్చి నిర్మాణానికి ఓ వర్గం వారు బాబు జగ్జీవన్ రామ్ పేరు పెట్టాలని పేర్కొనగా, మరో వర్గం అభ్యంతరం తెలిపింది.

ఆర్చి నిర్మాణం విషయంలో వివాదం .. ఇంటి ముందు పని చేసుకుంటున్న మరియమ్మ మృతి

ఆర్చి నిర్మాణం విషయంలో వివాదం .. ఇంటి ముందు పని చేసుకుంటున్న మరియమ్మ మృతి


దీనిపై అప్పుడు ఘర్షణ జరగగా పోలీసులు సర్ది చెప్పి పంపించారు . మరోసారి చర్చించటానికి రెండు వర్గాలు ప్రయత్నించిన క్రమంలో విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి . పరస్పరం రాళ్లు, ఇటుకలతో కొట్టుకోవడం తో ఈ ఘర్షణ సమయంలో ఇంటి ముందు అంట్లు తోముకుంటున్న, ఈ ఘర్షణతో ఎలాంటి సంబంధం లేని మహిళ మరియమ్మ కు రాళ్లు వచ్చి తగిలి దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో మరణించింది.మరణించిన మహిళ మరియమ్మ కు ముగ్గురు కుమారులు.

Recommended Video

AP Cabinet Has Taken Decision To Give Aid On Nivar Cyclone Before December
మరియమ్మ మృతదేహంతో ఆందోళన .. అర్దరాత్రి వరకు వెలగపూడిలో హైడ్రామా

మరియమ్మ మృతదేహంతో ఆందోళన .. అర్దరాత్రి వరకు వెలగపూడిలో హైడ్రామా

మరియమ్మ మృతితో ఆమె భర్త, కుమారులు తీవ్ర ఆగ్రహంతో ఆందోళనకు దిగారు .తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడిలో మరో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా, 30 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనకు ఎంపీ నందిగం సురేష్ బాధ్యుడని వారు ఆరోపించారు . మరియమ్మ మృతదేహంతో ఆందోళనకు దిగారు . ఆయన పేరును కూడా తమ ఫిర్యాదులో చేర్చారు . రణరంగంగా మారిన వెలగపూడి వ్యవహారం ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

English summary
The controversy in Velagapudi over the construction of the arch from Sunday night remained tense till midnight yesterday. Tensions were high in Velagapudi village following the death of Mariamma. Mariamma family kept the corpse and continued to protest until midnight. As the situation was not under control, Home Minister Sucharitha entered the field and said that an FIR would be registered against MP Nandigam Suresh and the funeral was held at midnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X