గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ రాజ్యంలో దళిత విద్యార్థి అరణ్య రోదన: పీహెచ్‌డీ స్కాలర్‌కు తప్పని వేధింపులు: లోకేశ్

|
Google Oneindia TeluguNews

జగన్ రాజ్యంలో దళితులకు వేధింపులు తప్పడం లేదు. రోజుకొకరు చొప్పున వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఆంధ్రా వర్సిటీలో కుల వివక్షపై గళమెత్తిన స్కాలర్ ఆరేటి మహేశ్‌పై యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కక్షసాధింపు చర్యలకు దిగారు. వర్సిటీలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడటంతో కక్షగట్టి.. హరాస్ చేస్తున్నారు. వర్సిటీల్లో కుల వివక్ష చూపించడం ఏంటీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు.

వర్సిటీలో కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆరేటి మహేష్‌పై వీసీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం జగన్ రెడ్డి దళిత వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. పీహెచ్‌డీ ఫైల్ ఆపి మహేష్‌ని గత 40 రోజులుగా వేధిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఉన్నత చదువు అభ్యసించి, ఉన్నత స్థానంలో ఉండాల్సిన దళిత బిడ్డ నడిరోడ్డుపై న్యాయం కోసం ఉద్యమం చేస్తున్నాడని గుర్తుచేశారు.

jagan govt harassed phd scholar: nara lokesh

Recommended Video

AP 3 Capitals : అమరావతి ముహుర్తానికే ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో శంకుస్థాపన..! || Oneindia

30 గంటలు దాటినా స్పందించకుండా ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరేటి మహేష్‌కి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహేష్‌పై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు.

English summary
ys jagan government harassed phd scholar in andhra university tdp leader nara lokesh tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X