గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్... ప్రెస్ మీట్ పెట్టి ఆ మూడు పదాలు సరిగ్గా పలుకు ముందు అంటున్న వైసీపీ ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

Recommended Video

లోకేష్ పై విరుచుకు పడ్డ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు || Sudhakar Babu Slammed Lokesh || Oneindia

ఏపీలో రాజకీయ నాయకుల మధ్య మాట యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వైసీపీ సర్కార్ ను, అలాగే సీఎం జగన్ ను, విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ రోజు ఆయన హనుమాన్ జంక్షన్ సీతారాంపురం వద్ద పట్టిసీమ నీటికి హారతి ఇచ్చి నారా లోకేశ్ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ అసమర్ధతపై దుమ్మెత్తిపోశారు . ఇక టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సెటైర్లు వేశారు.

దరిద్రం పడితే తప్ప పోలీస్ స్టేషన్ కు వెళ్లొద్దు .. 7 నెలలు జైల్లో ఉన్న అనుభవం నాది .. కోటంరెడ్డిదరిద్రం పడితే తప్ప పోలీస్ స్టేషన్ కు వెళ్లొద్దు .. 7 నెలలు జైల్లో ఉన్న అనుభవం నాది .. కోటంరెడ్డి

ఆ నాలుగు పదాలు కరెక్ట్ గా పలకాలని లోకేష్ ను ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు

ఆ నాలుగు పదాలు కరెక్ట్ గా పలకాలని లోకేష్ ను ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు

నాలుగు పదాలను కూడా సరిగా పలకలేని లోకేశ్ జగన్, విజయసాయిరెడ్డిల గురించి మట్లాడటం విడ్డూరంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. వైసీపీనేతలను విమర్శించే ముందు ప్రెస్ మీట్ పెట్టి మంగళగిరి, డెంగ్యూ, గుంటూరు పదాలను ముందు సరిగ్గా పలకాలని సవాల్ విసిరారు. లోకేష్ సరిగా మాట్లాడలేరని , ఒక నాలుగు పదాలే సరిగా మాట్లాడలేని లోకేష్ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ , విజయసాయి రెడ్డిలపై వ్యాఖ్యలు చెయ్యటం విడ్డూరమేనని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు, లోకేశ్ కు బుద్ధి రాలేదని అన్నారు. పదవుల కోసం ఎంతకైనా దిగజారుతారని సుధాకర్ బాబు విమర్శించారు.

ఏపీ ప్రజలు 151 పాములను చంపారని , 23 పాములను వదిలేశారని సెటైర్లు

ఏపీ ప్రజలు 151 పాములను చంపారని , 23 పాములను వదిలేశారని సెటైర్లు


వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులపై బాధ్యతా రహితంగా చేసిన ప్రకటనలకు సంతనూతలపాడు ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్ బాబు ఓ రేంజ్ లో టీడీపీ నేతలకు సెటైర్లు వేశారు. వైయస్ఆర్సిపి శాసనసభ్యులను, నాయకులను పాములతో పోల్చిన నారా లోకేష్ వ్యాఖ్యలను సుధాకర్ బాబు ఎగతాళి చేశారు. రాష్ట్ర ప్రజలు 151 పాములను చంపి పారేశారని , 23 పాములను మాత్రం బతికించారని తెలిపారు.

 టీడీపీ ఎమ్మెల్యేలను పాములని పేర్కొని రివర్స్ కౌంటర్ వేసిన సుధాకర్ బాబు

టీడీపీ ఎమ్మెల్యేలను పాములని పేర్కొని రివర్స్ కౌంటర్ వేసిన సుధాకర్ బాబు

పాములు ఎవరో స్పష్టంగా తెలుస్తుందన్న సుధాకర్ బాబు పాములు బయటకొచ్చాయని లోకేశ్ చెప్పిన మాట నిజమేనని... గత ఐదేళ్లలో చాలా పాములు బయటకు వచ్చాయని... వాటిని ప్రజలు చావగొట్టారని టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సుధాకర్ బాబు అన్నారు. కేవలం 23 పాములు మాత్రమే తప్పించుకున్నాయని... స్థానిక ఎన్నికల్లో ఏ ఒక్క అవినీతి పాము కూడా గెలవదని చెప్పారు. టీడీపీ నేతల అవినీతి భాగోతాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామని హెచ్చరించారు.

English summary
YSRCP MLA from Santhanuthalapadu TJR Sudhakar Babu, slammed Nara Lokesh for his irresponsible statements against senior leaders of the YSR Congress Party including the party's parliamentary party leader, V. Vijay Sai Reddy. Sudhakar Babu remarked sarcastically that Nara Lokesh, who is the all India general secretary of the TDP should first learn to pronounce four Telugu words correctly before speaking. These include the name of the constituency from where he contested and lost to Alla Ramakrishna Reddy, Mangalagiri. Sudhakar Babu questioned Lokesh on his criticism of senior party leader Vijay Sai Reddy. He pointed out that the Rajya Sabha member had only asked Nara Lokesh to hold a press conference and speak about the shortcomings of the YSRCP government.Sudhakar Babu ridiculed Nara Lokesh's statement likening YSRCP legislators and leaders to snakes. The YSRCP MLA from Santhanuthalapadu said that the people of the state had crushed 151 snakes and had let 23 survive. It is obvious who the snakes are, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X