గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీని తన తాత జాగీర్ లా విర్రవీగుతున్న జగన్ రెడ్డీ .. దమ్ముంటే ఆ పని చెయ్ : జగన్ కు లోకేష్ సవాల్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలలో అత్యధిక స్థానాలు వైసిపి కైవసం చేసుకుంటుందని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటుంటే వైసిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, అయినప్పటికీ టిడిపి హవా కొనసాగుతోందని టిడిపి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు .తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

భయపెట్టాలనే అచ్చెన్న అరెస్ట్ .. ఓటమి భయంతో పిరికిపందలా జగన్ చర్య : లోకేష్ తో పాటు టీడీపీ నేతలు ఫైర్ భయపెట్టాలనే అచ్చెన్న అరెస్ట్ .. ఓటమి భయంతో పిరికిపందలా జగన్ చర్య : లోకేష్ తో పాటు టీడీపీ నేతలు ఫైర్

ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపణ

ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపణ

పంచాయతీ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఎన్నికలలో గెలవాలని సవాల్ విసిరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఇప్పటివరకు మొదటి, రెండవ దశ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు మూడో విడత ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది . ఈనెల 17వ తేదీన మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అదేరోజు కౌంటింగ్ కొనసాగనుంది. ఇక ఇప్పటి వరకు రెండో విడత ఎన్నికలలోనూ వైసిపి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని నారా లోకేష్ ఆరోపించారు.

 వైసిపి ఎన్ని కుట్రలు చేసినా టిడిపి హవా పంచాయతీ ఎన్నికల్లో కనిపించింది

వైసిపి ఎన్ని కుట్రలు చేసినా టిడిపి హవా పంచాయతీ ఎన్నికల్లో కనిపించింది

వైసిపి ఎన్ని కుట్రలు చేసినా టిడిపి హవా పంచాయతీ ఎన్నికల్లో కనిపించిందని పేర్కొన్న నారా లోకేష్, వచ్చే మూడు నాలుగు విడతల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేయకుండా పోటీచేయాలని సవాల్ విసిరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన తాత జాగీర్ లా విర్రవీగుతున్న జగన్ రెడ్డి వైసిపి మద్దతుదారులు 95 శాతం పంచాయతీలలో ఏకగ్రీవంగా గెలవాలని టార్గెట్ పెట్టారని లోకేష్ వ్యాఖ్యానించారు . అయినప్పటికీ తొలివిడత లోనే తెలుగుదేశం సైన్యం ఎదురొడ్డి పోరాడి జెండా ఎగరేసిందన్నారు.

 రెండో విడతలో వైసిపి పెద్ద తలకాయల పంచాయతీలను సైతం మడత పెట్టింది

రెండో విడతలో వైసిపి పెద్ద తలకాయల పంచాయతీలను సైతం మడత పెట్టింది


రెండో విడతలో వైసిపి పెద్ద తలకాయల పంచాయతీలను సైతం మడత పెట్టింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మూడో విడతలో వైసిపికి మూడిందని తెలుగుదేశం కార్యకర్త నుంచి కార్యదర్శి వరకు వెన్ను చూపని పోరాటంతోనే పంచాయతీలో పట్టు సాధించామంటూ నారా లోకేష్ పేర్కొన్నారు.

టీడీపీ అభిమాని నుండి అధ్యక్షుడు వరకు పడిన కష్టానికి ప్రతిఫలం ఈ సానుకూల ఫలితాలు అంటూ అభిప్రాయపడిన నారా లోకేష్ బెదిరించి ఏకగ్రీవాలు చేసుకోవడం, చంపేస్తామని హెచ్చరించి విత్ డ్రా చేయించడం, ఒక విజయమేనా జగన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.

Recommended Video

Watch Rahul Gandhi’s Reaction at a Live Event as Earthquake Strikes- Viral
దమ్ముంటే అధికార దుర్వినియోగం చేయకుండా పోటీకి దిగాలని సవాల్

దమ్ముంటే అధికార దుర్వినియోగం చేయకుండా పోటీకి దిగాలని సవాల్

ఇంకా ప్రజలు వైసీపీ వైపు ఉన్నారని మీకు నమ్మకం ఉంటే, దమ్ముంటే అధికార దుర్వినియోగం చేయకుండా మూడు, నాలుగు విడతల్లో పోటీ చేయండి. ఎవరి సత్తా ఏంటో అక్కడే తేలిపోతుంది అంటూ నారా లోకేష్ సవాల్ విసిరారు. ఏదేమైనా పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఎవరికి వారు తామే ఆధిక్యత సాధించామని చెప్పుకోవడం, పట్టు నిలుపుకున్నామంటూ ప్రచారం చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

English summary
The panchayat election battle continues in the state of Andhra Pradesh. The TDP leaders are countering that the YCP is abusing its power . Nara Lokesh said TDP is fighting with ruling party and supporters are winning . Lokesh challenged ys jagan If jagan had guts to Compete in three or four phases without being any threatens. .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X