సీఎం జగన్ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలి ... లోకేష్
సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు కావడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు జగన్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు...జగన్మోహన్ రెడ్డి సుఖసంతోషాలతో ,ఆయురారోగ్యాలతో ఉండాలని టీడీపీ నేత నారా లోకేష్ కొరుకున్నారు. సీఎం జగన్ పుట్టిన రోజు సంధర్భంగా ఆయన ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు లోకేష్. జగన్ ఇలాంటీ పుట్టిన రోజుల మరిన్ని జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పలువురు నేతలు, ఇతర ప్రముఖులతో పాటు విపక్ష నేతలు కూడ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే జగన్ పుట్టిన రోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. స్వరాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల్లో కూడ ఆయన అభిమానులు ఫ్లేక్సీలు ఏర్పాటు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ మంత్రి, మాజీ సీఎం తనయుడు నారా లోకేష్ కూడా సీఎం పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేశారు. 'ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.