IPL 2020 Final:రోహిత్ శర్మ, ధవన్ల ముందు ఉన్న రికార్డులు ఇవే..!
దుబాయ్: కరోనా మహమ్మారి కష్ట కాలంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని ప్రారంభమైన ఐపీఎల్ 13వ సీజన్ ఈ రోజుతో ముగియనుంది. రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య టైటిల్ పోరు జరుగనుంది. ఇప్పటికే నాలుగు టైటిళ్లు గెలిలిచిన ముంబై మరో కప్పు మీద కన్నేయగా.. మొదటిసారి ఫైనల్ చేరిన ఉత్సాహంలో తొలి టైటిల్ దక్కించుకోవాలని ఢిల్లీ చూస్తోంది. మరి ఈ బిగ్ఫైట్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. అయితే ఈ మ్యాచ్లో ట్రోఫీతో పాటు కొన్ని రికార్డులు ఆటగాళ్లను ఊరిస్తున్నాయి.
2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా.. ప్రతి లీప్ సంవత్సరంలో ఓ కొత్త జట్టు ఛాంపియన్ అవుతోంది. 2008లో రాజస్థాన్ రాయల్స్.. 2012లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఇక 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ కప్ కొట్టింది. ఈ ట్రెండ్ ప్రకారం 2020లోనూ కొత్త ఛాంపియన్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ కప్ దక్కించుకుంటుంది.
ముంబై ఇండియన్స్ అత్యధికసార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఆ జట్టు నాలుగుసార్లు టైటిల్ నెగ్గితే.. సరి సంఖ్య వచ్చే ఏడాదిలో కప్ గెలవలేదు. ముంబై 2013, 2015, 2017, 2019 సంవత్సరాల్లో విజేతగా నిలిచింది. ఇవన్నీ బేసి సంఖ్యలే ఇక్కడ విశేషం. ఇది ఢిల్లీకి కలిసిరానుంది. ఇక ఆటగాళ్ల రికార్డులు చూస్తే...
#
ఈ
మ్యాచ్తో
ముంబై
కెప్టెన్
రోహిత్
శర్మ
టీ20
లీగ్లో
200
మ్యాచ్లు
పూర్తి
చేసుకుంటాడు.
#
ముంబై
తరఫున
4,000
పరుగుల
మైలురాయికి
హిట్మ్యాన్
రోహిత్
మరో
8
పరుగుల
దూరంలో
ఉన్నాడు.
#
మరో
రెండు
సిక్సర్లు
బాదితే
ముంబై
ఆల్రౌండర్
కీరన్
పొలార్డ్
టీ20
లీగ్లో
200
సిక్సర్లు
బాదిన
ఆటగాడిగా
రికార్డుల్లోకి
ఎక్కుతాడు.
#
ఢిల్లీ
ఓపెనర్
శిఖర్
ధావన్
టీ20
లీగ్లో
1,500
పరుగులకు
మరో
36
పరుగుల
దూరంలో
ఉన్నాడు.
ఢిల్లీ
తరఫున
గబ్బర్
ఇప్పటి
వరకూ
1,464
పరుగులు
చేశాడు.
#
ఈ
మ్యాచ్తో
ధావన్కు
టోర్నీలో
టాప్
స్కోరర్
అయ్యే
అవకాశం
ఉంది.
మరో
68
పరుగులు
చేస్తే..
పంజాబ్
కెప్టెన్
కేఎల్
రాహుల్
(670)ను
అధిగమిస్తాడు.
#
ఢిల్లీ
కెప్టెన్
శ్రేయస్
అయ్యర్
మరో
46
పరుగులు
చేస్తే..
ఈ
సీజన్లో
500
పరుగుల
మార్క్
చేరుకుంటాడు.