తెలంగాణలో తగ్గిన కరోనా పరీక్షలు.. కొత్త కేసులు కూడా, పెరిగిన రికవరీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా పరీక్షలు పెంచినకొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు 38,565 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1456 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్త కేసుల సంఖ్య 2,27,580కి చేరింది.
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు: 20వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు
ఈ మేరకు వివరాలను గురువారం ఉదయం రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1292కు చేరింది. కరోనా బారినుంచి బుధవారం ఒక్కరోజే 1717 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,06,105కు చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 20,183 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 16,977 మంది హోంఐసోలేషన్లో చికిత్స తీసుకుంటుండగా, మిగితావారు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 39,78,869కి చేరింది. తెలంగాణలో కూడా కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా నమోదవుతుండటం గమనార్హం.
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 77,05,158 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో 68,71,895 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి 1,16,653 మంది మరణించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7,15,327 యాక్టివ్ కేసులున్నాయి.
దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు కూడా ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి.