హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ గండిపేటలో విషాదం: ఆడుకుంటూ కరెంట్ పోల్ పట్టుకొని చిన్నారి మృతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని గండిపేట పెబల్ సిటీలో విషాదం చోటు చేసుకుంది. ఓ చిన్నారి ఆడుకుంటూ అలా వెళ్లి కరెంట్ పోల్ పట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత ఎంతకు కదల్లేదు. వెళ్లి చూడగా అతని చనిపోయాడు. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం పెబల్ సిటీలో ఉంటోంది. వారికి ఒకటో తరగతి చదువుతున్న కొడుకు ఉన్నాడు.

మంగళవారం అతను ఆడుకుంటూ కరెంట్ పోల్ వద్దకు వెళ్లాడు. ఆ కరెంట్ పోల్ వైర్లు బయటకు ఉన్నాయి. ఆ బాలుడి పేరు మణిదీప్‌గా తెలుస్తోంది. అతను కరెంట్ పోల్ పట్టుకొని ఆడుకునే ప్రయత్నం చేశాడు. కానీ బయటకు వచ్చిన వైర్లు అతని ప్రాణాన్ని తీసుకున్నాయి.

1st class student dead after playing with current poll

ఈ ప్రమాదంపై పెబల్ సిటీలో ఉన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద నుంచి మెయింటెనెన్స్ ఛార్జీలు తీసుకొని కూడా కరెంట్ పోల్ వైర్లు బయటకు వచ్చినా సరిగా చూసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్లు కూడా డమ్మీ క్యాండెంట్స్ అని మండిపడుతున్నారు. ఈ బాలుడి ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పిల్లాడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

బాలుడు చనిపోయిన వీడియో చూసిన హృదయం ద్రవిస్తుంది. ఈ బాలుడితో పాటు మరో బాలుడు ఆడుకుంటున్నారు. మరో బాలుడు సైకిల్ పైన వస్తుండగా, ఈ చిన్నారు ఆ సైకిల్ ముందు చిన్నగా పరుగెత్తుతూ వెళ్లి కరెంట్ పోల్ పట్టుకున్నాడు. దానిని చేతితో పట్టుకొని తిరిగే క్రమంలో.. పట్టుకున్న క్షణాల్లోనే కదలకుండా ఉండిపోయాడు. మరికొద్ది క్షణాల్లో కిందపడిపోయాడు. చనిపోయినట్లుగా గుర్తించారు.

English summary
1st class student dead after playing with current poll in Hyderabad on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X