తెలంగాణలో కరోనా కల్లోలం: 2 వేల మార్క్ దాటిన కేసులు, 11 మంది మృత్యువాత..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం 1986 మందికి పాజిటివ్ రాగా.. శుక్రవారం ఆ సంఖ్య 2 వేల మార్క్ దాటింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 2 వేల 83 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది.
కరోనా అతనికి మంచి చేసింది... 33ఏళ్లుగా సాధ్యం కాని దాన్ని నెరవేర్చింది...
64 వేల మార్క్..
2083 పాజిటివ్ కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 64 వేల 786కి చేరింది. గత 24 గంటల్లో 1114 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 43 వేల 751 మందికి చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 17 వేల 754 మంది చికిత్స పొందుతున్నారు. మొన్న రాత్రి నుంచి నిన్న రాత్రి వరకు వైరస్ సోకి 11 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 530కి చేరింది.
గ్రేటర్లో 578..
గత 24 గంటల్లో గ్రేటర్ పరిధిలో 578 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం గ్రేటర్లో 586 పాజిటివ్ కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల నుంచి బల్దియా పరిధిలో 500 నుంచి 600 లోపు కేసులు వస్తున్నాయి. కానీ సమీపంలో గల మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం వందకు పైచిలుకు కేసులు వస్తున్నాయి.
Recommended Video
అంతకుముందు రోజు 1216..?
శుక్రవారం వచ్చిన 2 వేల పాజిటివ్ కేసుల్లో 1216 ఫలితాలు అంతకుముందు రోజు వచ్చిన దానిలో కలిపారు. ఆ రోజు 21,380 మందికి పరీక్షలు నిర్వహించామని, మరో 1216 ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఆ రోజు చేసిన ఫలితాలు ఎన్ని వచ్చాయి. మరుసటి రోజు ఎన్ని కేసులు వచ్చాయనే అంశంపై స్పష్టత లేదు. కానీ 2 వేల పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.