శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నకిలీ వీసాల కలకలం .. 26 మంది మహిళలు అరెస్ట్
తెలంగాణా రాష్ట్రంలో నకిలీ వీసాలకు కొదువే లేదని తేల్చేసింది నేడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన సంఘటన . శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయంలో నకిలీ వీసాలు కలకలం సృష్టించింది . సాధారణంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు చేస్తున్న తనిఖీల్లో భాగంగా ఈ విషయం బైటపడినట్లుగా తెలుస్తోంది.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 26 మంది మహిళలు నకిలీ వీసాలతో అడ్డంగా బుక్కయ్యారు. ప్రయాణీకుల వద్ద అధికారులు వీసాలను పరిశీలిస్తుండగా..26 మంది మహిళలు నకిలీ వీసాలతో కువైట్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తేలింది. దీంతో వీరందరినీ అధికారులు అరెస్ట్ చేశారు.
మోదీపై నాది నిజమైన ప్రేమే .. ఆప్యాయత చూపని వారిది ఇష్టమే కాదు: రాహుల్ సెటైర్లు
ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు..ఈ నకిలీ వీసాల వెనుకున్న వారు ఎవరు..ఎక్కడ ఈ వీసాలను తయారుచేశారు. దీనికి అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తే నకిలీ వీసాల ముఠా గుట్టు రట్టయ్యే అవకాశం వుంది.