301 మందికి కరోనా.. ఇద్దరు మృతి... 3 లక్షలకు చేరువగా పాజిటివ్ కేసులు
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ స్ట్రెయిన్ టెన్షన్ మాత్రం ఉంది. కొత్త రకం వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరించగా.. అదే రేంజ్లో కేసులు పెరుగుతున్నాయి. బ్రిటన్ కన్నా దేశంలో స్ట్రెయిన్ కేసులు పెరగడం విశేషం. ఇటు జపాన్లో మరో కొత్త రకం వైరస్ హడలెత్తిస్తోంది.
కరోనా కేసుల విషయానికి వస్తే మంగళవారం కొత్తగా 301 కరోనా పాజీటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,309కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది. సోమవారం ఇద్దరు కరోనా మృతితో చెందగా.. ఇప్పటి వరకు మొత్తం 1,568 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,524 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ నుంచి 2,84,217 మంది కోలుకున్నారు. రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉండటంతో టెన్షన్ లేకుండా అయ్యింది.
Recommended Video
కరోనాకు వ్యాక్సిన్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభం అవుతోంది. ఇప్పటికే వ్యాక్సిన్లను ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిస్తున్నారు.