హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో కరోనా కల్లోలం.. 457 మందికి పాజిటివ్

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల నుంచి కేసుల సంఖ్య ఎక్కువ అవుతుంది. తెలంగాణ రాష్ర్టంలో గత 24 గంటల్లో 22,384 కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 457 మందికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాదులో అత్యధికంగా 285 కొత్త కేసులు వెలుగుచూశాయి. సంగారెడ్డి జిల్లాలో 35, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27, రంగారెడ్డి జిల్లాలో 25 కేసులు వెల్లడయ్యాయి.

 457 people are infected coronavirus

494 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,02,379 మంది కరోనా బారినపడగా, వారిలో 7,93,521 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. ఇంకా 4,747 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మరణించారు.

దేశంలో ఇప్పటిదాకా 197.955 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాదాపుగా అందరూ రెండు డోసులు తీసుకున్నారు. బూస్టర్ డోసు కూడా ఎక్కువ మందే తీసుకున్నారు. దీని వల్లే కేసులు పెరుగుతున్న తీవ్రత ఆ స్థాయిలో లేదు. మరణాలు సంభవిస్తోన్న వారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి. ఈ విషయాన్ని వైద్యారోగ్యశాఖ తెలియజేసింది. సో మిగతావారు మాస్కులు పెట్టుకుని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. శానిటైజర్ కూడా వాడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా కలియ తిరుగుతున్నారు.

English summary
457 people are infected coronavirus in the telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X