హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో తగ్గుముఖం: 657 కేసులు.. ఇద్దరు మృతి

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలో హెచ్చు తగ్గులు ఉండగా.. తెలంగాణలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. 578 మంది బాధితులు చికిత్స నుంచి కోలుకొన్నారు. వైరస్ సోకిన ఇద్దరు చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,43,093కు పెరిగాయి. ఇవాళ్టి వరకు మొత్తం 6,29,986 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇంకా 9,314 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇవాళ్టితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 3,793కు చేరాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ 1,16,815 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసింది. రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.96 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

657 people infected corona in telangana

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

English summary
last 24 hours 657 people infect corona in telangana and 2 people died due to virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X