ఏడేళ్ల బాలుడిపై అత్యాచారం... హత్య !
హైదరాబాద్లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడిపై అఘాయిత్యం చేసి కృరంగా చంపివేశాడు గుర్తు తెలియని దుండగుడు. ముప్పై నిమిషాల్లోనే రెండవ తరగతి చదువున్న అబ్బాయిపై కృరంగా అఘాయిత్యం చేసి అనంతరం హత్య చేసి, పక్కనే ఉన్న చెట్లపొదల్లో పడేసి వెళ్లిపోయాడు.
హైదరబాద్ పహడిషరిఫ్లోని ఓ వాడి-ఏ-ముస్తఫా కాలనీలో ఈ సంఘటన జరిగింది. రెండవ తరగతి చదువుతున్న బాలుడు రాత్రి 9గంటల సమయంలో తన ఇంటికి సమీపంలోని షాపులో కూల్డ్రింక్స్ కొనేందుకు వెళ్లాడు. అయితే పదిహేను నిమిషాలైన బాబు రాకపోవడంతో తన తండ్రి బయటికి వెళ్లి వెతికాడు. దీంతో తన ఇంటికి దగ్గరలోని ఖాజామోయినోద్దిన్ అనే ప్లాట్ లో చాలమంది గుమికూడారు .దీంతో అక్కడికి వెళ్లిన తండ్రికి కొడుకు శవం కనిపించింది.
దీంతో తండ్రి బోరున విలపించాడు. స్థానికుల కథనం ప్రకారం అబ్బాయి ఏడుస్తున్నాడని ఈనేపథ్యంలోనే గుర్తుతెలియని వ్యక్తి దగ్గరలోని పొదల్లోకి తీసుకెళ్లినట్టు తెలిపారు. కాగా ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి పారిపోతుండగా తాము చూశామని స్థానికులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి, బాబు తలను నేలకు కొట్టి చంపివేశారని తెలిపారు.
పోలీసులు బాబు శవాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా పోస్టుమార్గం రిపోర్ట్ లో బాలున్ని శరీరకంగా తీవ్రంగా హింసించి హత్య చేసినట్టు తేలింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. కాగా మృతి చెందిన అబ్బాయిది ఓ సాధరణం కుటుంభం. బాలుడి తండ్రి స్థానికంగా సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు.