హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంజారహిల్స్‌లో భారీ దొంగతనం.. 3కోట్ల విలువైన వజ్రాలు, నగదు మాయం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ బంజారహిల్స్‌లో సోమవారం రాత్రి భారీ దొంగతనం చోటుసుకుంది. మాజీ ఎంపీ టీ సుబ్బిరాం రెడ్డి బంధువు అయిన ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో ఈ చోరీ జరిగింది. చోరిలో భాగంగా మూడు కోట్ల రుపాయాల విలువైన వజ్రాలు, బంగారం,నగదు మాయమైనట్టు తెలుస్తోంది. కాగా టీ సుబ్బిరాం రెడ్డికి అన్న కొడుకు అయిన ఉత్తమ్‌రెడ్డితో పాటు ఇంట్లో కుటుంభ సభ్యులుపాటు ఎవరు లేకుండా బయటకు వెళ్లారు. ఈ సమయంలోనే చోరీ జరిగింది. బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్న ఉత్తమ్‌రెడ్డి కుటుంభసభ్యులు చోరీ జరిగినట్టు గుర్తించారు. దీంతో వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరికి గురైన వాటిలో రెండు కోట్ల రుపాయాల విలువైన వజ్రాలు, బంగారం కాగా కోటి రుపాయాల వరకు నగదు ఉన్నట్టు పోలీసులకు తెలిపారు.

ఉత్తమ్‌రెడ్డి కుటుంభ సభ్యుల నుండి ఫిర్యాదు అందుకున్న బంజారహిల్స్ పోలీసులు హుటాహుటిన సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో ఇంట్లో గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరీశీలిస్తున్నారు.

A major theft at Banjara Hills in Hyderabad.

అంత్యంత కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లు ఉంటే ప్రాంతంలో దొంగతనం జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చాల రోజుల తర్వాత భారీ దొంగతనం జరగడంతో తెలిసిన వాళ్ల లేక ఇతర ప్రాంతాల నుండి వచ్చారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు..అయితే బంజారాహిల్స్ లాంటీ ప్రాంతాల్లో దొంగతనాలు జరగడంతో స్థానిక ప్రజలు కూడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
A major theft took place on Monday night at Banjara Hills in Hyderabad.Three crore rupees worth of diamonds, gold and cash was the theft reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X