ప్రియుడి మోజులో భర్తను సజీవదహనం చేసిన భార్య.. వనస్థలిపురం కేసును చేధించిన పోలీసులు
వనస్థలిపురానికి చెందిన ఓ వివాహిత మహిళ, ప్రియుడి మోజులోపడి తన భర్తను సజీవదహానం చేసింది. అప్పటి వరకు భర్తతో టిక్టాక్ చేస్తూ.. భర్తను నమ్మించిన భార్య ఒక్కసారిగా గాఢ నిద్రలో ఉన్న భర్త గుడిసేకు ప్రియుడితో కలిసి నిప్పుపెట్టింది. అనంతరం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనిగా సృష్టించేందుకు ప్రయత్నాలు చేసింది. చివరకు పోలీసుల విచారణలో బయటపడడంతో ప్రియుడితో పాటు నిందితురాలు కటకటాల పాలు అయింది.
గత నెల 26న రాత్రీ రమేష్ అనే వ్యక్తి నిద్రిస్తుండగా గుడిసేకు నిప్పటించడంతో సజీవదహనం అయ్యాడు. ఈ కేసును పోలీసులు చేధించారు. ఈ హత్యను బాధితుడి భార్య స్వప్న అతని ప్రియుడు వెంకటయ్యలు కలిసి చేసినట్టుగా పోలీసులు తేల్చారు. వివరాల్లోకి వెళితే.. రమేష్ ఆయన భార్య స్వప్న వనస్థలిపురంలోని ఎస్కేడీ నగర్లోని ఓ గుడిసేలో నివాసం ఉంటున్నారు. అయితే స్వప్నకు వెంకటయ్య అనే యువకుడితో వివాహేతర సంబంధాన్ని గత కొంతకాలంగా కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలోనే తమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను తొలగించేందుకు ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలోనే భర్త నిద్రిస్తున్న గుడిసేపై పెట్రోల్ పోసీ ప్రియుడు రమేష్ తో కలిసి నిప్పు పెట్టారు. అనంతరం అక్కడి నుండి జారుకున్నారు. దీంతో బయటకు రాలేని రమేష్ సజీవ దహనం అయ్యాడు. సంఘటన స్త అనుమాన స్పద మృతిగా పోలీసులు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అనంతరం రమేష్ భార్య స్వప్నతోపాటు ఆమే ప్రియుడు వెంకటయ్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. ట్విస్ట్ ఏమిటంటే... రమేష్ మరియు స్వప్నలు అంతకు ముందు టిక్టాక్ కూడ చేశారు. దీంతో వారు ఇద్దరు చేసిన టిక్టాక్ వీడియో సోషల్ మీడీయాలో కూడ చక్కర్లు కొడుతోంది.