దిశా కేసులో కొత్త కోణం .. చెన్నకేశవులు భార్య మైనర్ .. 13 ఏళ్లే అని గుర్తించిన అధికారులు
దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న దిశ అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నిందితులు జొల్లు శివ, జొల్లునవీన్ ఇద్దరు మైనర్లు అని వార్తలు రాగా, తాజాగా ఏ4 నిందితుడుగా ఉన్న చెన్నకేశవులు భార్య మైనర్ అన్న విషయం వెలుగులోకి వచ్చింది.
దిశా కేసు... ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను విచారిస్తున్న ఎన్హెచ్ఆర్సీ
దిశ కేసు నిందితులు గతంలో పలు నేరాలకు పాల్పడ్డారని పోలీసులు జాతీయ మానవ హక్కుల కమీషన్ కు పలు ఆధారాలను సమర్పించారు. అయితే తాజాగాచెన్నకేశవుల భార్య గురించి కొన్ని ఆసక్తిరమైన నిజాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో చెన్నకేశవులు కుటుంబ సభ్యులతో మాట్లాడారు అధికారులు . చెన్నకేశవులు భార్య మైనర్ అని, ఆ బాలికకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి స్వీకరించిన అధికారులు గుర్తించారు.
పాఠశాలలో నమోదై ఉన్న వివరాల ప్రకారం ఆ బాలిక వయసు 13 సంవత్సరాలుగా ఆరు నెలలుగా గుర్తించారు. దీంతో.. ఆమె మైనర్ అని తేలింది. అంతేకాకుండా.. ఆమె ప్రస్తుతం 6 నెలల గర్భవతిగా ఉందని తెలుస్తుంది. చిన్నప్ప నుండి ఆ బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె.. బాబాయి, నాన్నమ్మల వద్ద పెరిగింది. చెన్నకేశవులు ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనంతరం చెన్నకేశవులు భార్యగా ఆమె అత్తవారింట్లో జీవనం సాగిస్తున్నది.
ఆమెకు ఒక చెల్లెలు తమ్ముడు కూడా ఉన్నారు. ఎన్కౌంటర్ మృతుడు చెన్నకేశవులు భార్య మైనర్ కావడంతో ఆమెకు 18 సంవత్సరాలు వచ్చేంతవరకూ బాలికల సంరక్షణ విభాగానికి తరలిస్తామని కుటుంబసభ్యులను అధికారులు అడిగారు.దానికి వారు ససేమిరా అన్నారు. దీంతో ఆమె చెల్లెలు, తమ్ముడినైనా పంపించమని కోరారు అధికారులు. అయితే తమ్ముడిని మాత్రమే పంపిస్తామని.. చెల్లెలు తమ వద్దే ఉటుందని చెన్నకేశవులు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.మొత్తానికి దిశ ఉదంతంతో అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితుల ఎన్కౌంటర్, ఆపై మరిన్ని చీకటి కోణాలు, కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.