నార్సింగిలో మహిళ కిడ్నాప్, అత్యాచారం
హైదరాబాద్లో మరోసారి కామంధులు రెచ్చిపోయారు. ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సాముహిక అత్యాచారం చేశారు. అనంతరం మహిళలను వదిలివేసి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అత్యాచారానికి గురైన మహిళ కేకలు వేయడంతో దుండగులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్తానికులు వచ్చి ఆమేకు కాపాడారు.
హైదరాబాద్ శివారులో శుక్రవారం మరోదారుణం చోటుచేసుకుంది. నార్సింగి ప్రాంతంలోని పుప్పాలగూడలో ముగ్గురు కామాంధులు ఒంటరి మహిళపై కన్నేసి, ఆమేను కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలకు గురి చేశారు. అనంతరం సాముహిక హత్యాచారం చేశారు. అయితే దుండగుల భారి నుండి మహిళ తప్పించుకుని రోడ్డుపైకి చేరింది. అనంతరం కేకలు వేయడంతో సమీపంలో ఉన్న స్థానికులు చేరుకున్నారు.
అప్పటికే ముగ్గురు నిందితులు పట్టుకునేందుకు గ్రామస్తులు పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆత్యాచారానికి పాల్పడిన వారు ఇద్దరు తప్పించుకోగా, ఒకరు పట్టుబడ్డారు. దీంతో పట్టుపడిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక అత్యాచారానికి గురైన మహిళను వైద్యచికిత్సల కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే మహిళను కిడ్నాప్ చేశారా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాగా నగర శివారుల ఇటివల ఇలాంటీ అత్యాచారాలు పెరిగిపోతుండడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.