వేధింపులు భరించలేక కోడుకును చంపించిన తల్లిదండ్రులు...!
హైదరాబాద్లో దారుణం జరిగింది. కన్న కొడుకునే తల్లిదండ్రులు చంపించి వేశారు. కోడుకు తాగుడుకు బానిసై వేధిస్తున్నారంటూ చిన్నకొడుకు స్నీహితులతో కలసి ప్లాన్ వేశారు.కొడుకు చనిపోతేనే తమకు విముక్తి కల్గుతుందని భావించారు.దీంతో తల్లిదండ్రుల పెళ్లిరోజే కొడుకును హత్యచేయించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
మెడ్చల్ దారుణం ..
మెడ్చల్ జిల్లాలోని కాప్రా వంపుగూడ కాలనీలో శ్రీనివాస్ ,మణెమ్మ అనే ఇద్దరి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఒకరు సాయికుమార్ కాగా మరోకరు సందీప్. అయితే 24 సంవత్సరాల వయస్సును పెద్ద కొడుకు సాయికుమార్ మధ్యలోనే చదువు మానేసీ తాగుడుకు బానిసయ్యాడు. దీంతో డబ్బుసంపాదన కోసం పెయింటర్ గా మారాడు. కాగా శ్రీనివాస్ మణెమ్మలు కాప్రా మున్సిపాలీటిలో ఇద్దరు కాట్రాక్ట్ కూలీలుగా పనిచేస్తున్నారు.
తాగుడుకు బానిసైన యువకుడు
ఇక తాగుడుకు బానిసైన సాయికుమార్ తల్లిదండ్రులను వేధింపులకు గురిచేశేవాడు. ఇష్టం వచ్చినట్టు తిట్టడడంతోపాటు ఎప్పుడు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో వారికి కోడుకు సాయికుమార్ ఆగడాలు శృతిమించి పోయాయి.సంవత్సరాలుగా ఎంతచెప్పినా మారడం లేదు. దీంతో శ్రీనివాస్,మణెమ్మలు కొడుకు ప్రవర్తన పై విసుగు చెందారు. ఈనేపథ్యంలోనే సాయికుమార్ను అంతం చేస్తే సమస్యకు పరిష్కారం లభించదని భావించారు. అనుకున్నదే తడవుగా ప్లాన్ను అమలు చేశారు.
కొడుకును చంపించిన తల్లిదండ్రులు
ఇక ఏప్రిల్ 25వ తేదీన శ్రీనివాస్ ,మణెమ్మలక పెళ్లీరోజు కావడంతో శ్రీనివాస్ కుతురు కూడ వచ్చింది. పెళ్లిరోజు కావడంతో ఇంట్లో తమ్ముడితోపాటు అందరు సంతోషంగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో సాయికుమార్ తాగి వచ్చి తల్లిదండ్రులతో ఘర్షణకు దిగాడు. కారణాలేవేైనా వారిని ధుర్బాషలాడుతూ వెళ్లిపోయాడు. కాగ అప్పటికే సాయి కుమార్ను కడతేర్చాలని స్కెచ్ వేసుకోవడంతో సాయికుమార్ తమ్ముడు సందీప్ స్థానికంగా ఉన్న కొంతమంది మిత్రులతో సాయికుమార్ విషయాన్ని చర్చించాడు. సాయికుమార్ ను చంపితే అడిగినంత డబ్బు ఇస్తామని వారికి చెప్పారు.
పార్టీ ఉంది రమ్మంటూ ...
ఇక సందీప్ ఫ్రెండ్స్ సాయికుమార్ను పార్టీ ఉందని పంపుగూడలోనిలో ఎవ్వరు రాని ప్రాంతానికి తీసుకెళ్లారు. సాయికుమార్కు ఫుల్ గా తాగించారు. అనంతరం అనుకున్న ప్లాన్ను అమలు చేశారు. తాగిన మైకంలో సాయికుమార్ ను తీవ్రంగా కొట్టారు. రక్తపుమడుగులో ఉన్న అతన్ని బీరు సీసాలతోనే గొంతును కోశారు. అనంతరం అక్కడ గోయ్యి తీసీ పాతీపెట్టారు.
ఏమి తెలియనట్టు పోలీస్ స్టేషన్ లో కేసు
ఇక తమకు ఏమీ తెలియనట్టే తల్లిదండ్రులు కొడుకు కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టడడంలో వంపుగూడలో గుర్తు తెలియని శవం లభించడంతో అక్కడ ఎముకలు పుర్రె ఉందన్న సమాచారంతో పోలీసులు కూపి లాగారు విషయం బయటపడడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న పెద్దమనుష్యులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.