సుమేధా మృతితో కదిలిన సర్కార్ - అంతటా ఓపెన్ నాలాల మూసివేత - కేటీఆర్ కీలక ఆదేశాలు
కొద్ది రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తుండటం, రాబోయే రెండు వారాలు కూడా విస్తారంగా వానలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనాలు వెలువడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవల హైదరాబాద్ లోని దీనదయాళ్ నగర్ లో సుమేధ అనే 12 ఏళ్ల చిన్నారి నాలాలో కొట్టుకుపోయి మరణించిన ఘటనతో సర్కారులో కదలిక వచ్చింది. హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా ఓపెన్ నాలాల పైకప్పులను మూసేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. భారీ వర్షాలపై మున్సిపల్ శాఖ అధికారులతో సోమవారం జరిపిన సమీక్షలో ఈ మేరకు మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు జారీచేశారు.
నేరెడ్మెట్లో మిస్సింగ్ బాలిక మృతదేహం లభ్యం: సైకిల్తో సహా డ్రైనేజీలో కొట్టుకుపోయి
రూ. 300 కోట్లతో స్పెషల్ డ్రైవ్..
హైదరాబాద్
నగరంతోపాటు
రాష్ట్రమంతటా
ఓపెన్
నాలాల
పైకప్పులు
మూసివేయాలని
ప్రభుత్వం
నిర్ణయించింది.
ఓపెన్
నాలాలపై
క్యాపింగ్(బాక్స్
డ్రైనేజీల)
నిర్మాణానికి
రూ.
300
కోట్లతో
స్పెషల్
డ్రైవ్
చేపట్టబోతున్నట్లు
ఐటీ,
మున్సిపల్
శాఖ
మంత్రి
కేటీఆర్
ప్రకటించారు.
పనులు
వేగంగా
ప్రారంభమయ్యేలా
సిటీలోని
అన్ని
నాలాల
సమాచారం
సేకరించాలని
అధికారులను
ఆదేశించారు.
భారీ
వర్షాలపై
మున్సిపల్,
జీహెచ్ఎంసీ,
జలమండలి
అధికారులతో
ఆయన
సమీక్షా
సమావేశం
నిర్వహించారు.
సిగ్గుపడాలి..చేయని సాయం చేసినట్లు - బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్ - లెక్కలతో బండి సంజయ్ కౌంటర్
ఇకపై ఓపెన్ నాలా కనిపించొద్దు..
రెండు మీటర్లకన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలపై క్యాపింగ్ నిర్మాణం చేస్తామని, అదే, రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పున్న నాలాలకు సంబంధించి సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను అనుసరించి చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తిచేసేలా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించాలని, ఒకవేళ నాలాలకు క్యాపింగ్ కుదరకపోతే పకడ్బందీగా ఫెన్సింగ్ చేయాలని, రాబోయే రోజుల్లో ఓపెన్ నాలాలు కనిపించడానికి వీల్లేదని మంత్రి ఆదేశించారు. అదేసమయంలో సిటీ సహా అన్ని ప్రాంతాల్లో పాత భవనాలను పరిశీలించాలని, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నవాటిని వెంటనే కూల్చేయాలని సూచించారు.
హ్యాట్సాఫ్ వరుణ్..పీకల్లోతు నీళ్లలో 10ఏళ్ల బాలుడి నిరసన -అందరినీ కదిలించాడు -రైతులంటే సినిమా షో కాదు
Recommended Video
మున్సిపల్ సిబ్బందికి సెలవులు రద్దు
భారీ
వర్షాల
నేపథ్యంలో
రాబోయే
రెండు
వారాల
పాటు
మున్సిపల్
శాఖలో
సిబ్బందికి
సెలవులు
రద్దు
చేయాలని
మంత్రి
ఆదేశించారు.
విపత్తుల
వల్ల
ప్రాణ
నష్టం
జరగకుండా
చూసుకోవాలని,
నిరంతరం
క్షేత్రస్థాయిలోనే
ఉంటూ
పర్యవేక్షణ
చేయాలని
అధికారులకు
సూచించారు.
వర్షాల
కారణంగా
దెబ్బ
తిన్న
రోడ్లకు
మరమ్మతులు
చేపట్టాలని,
వర్షాలు
తగ్గగానే
పారిశుద్ధ్య
పనులపై
ఫోకస్
పెంచాలని
చెపపారు.
గత
10
రోజుల్లోనే
54
సెం.మీ.
భారీ
వర్షపాతం
నమోదైందని
అధికారులు
మంత్రికి
వివరించారు.