హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రోలో మరో ప్రమాదం...?

|
Google Oneindia TeluguNews

హైదారాబాద్ మెట్రోలో మరోప్రమాదం జరిగింది. రైళ్ల కంపార్ట్‌‌మెంట్‌లోని పై బాగం ఊడి ప్రయాణికులపై పడింది. అయితే ఈ సంఘటన ఎల్బీనగర్ మియాపూర్ మార్గంలో ఉన్న ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌ ప్రాంతంలో జరుగినట్టు తెలుస్తోంది. అయితే దీని వల్ల ఎలాంటీ ప్రమాదం జరగలేదు. అయితే కంపార్ట్‌మెంట్‌ పై భాగం ఊడిపోడంతో రైలు ప్రయాణికలు ఆందోళన చెందారు. ఇక ఊడిపోయిన భాగాన్నితిరిగి పెట్టేందుకు మెట్రో అధికారులు ప్రయత్నాలు చేశారు. కాని ప్రమాదానికి సంబంధించి మెట్రో అధికారుల వివరణ ఇవ్వాల్సి ఉంది.

మెట్రో ప్రయాణంలో మరో ప్రమాదం జరిగింది. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం అమిర్‌పేట్‌లోని మెట్రో స్టేషన్‌లో నిర్మాణం కూలి మహిళ మృతి చెందడంతో మెట్రో ప్రయాణంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో నిర్మాణపరంగా పలు స్టేషన్లలలో లోపాలు గుర్తించారు. దీంతో పలు స్టేషన్లలో నిర్మాణ లోపలను గుర్తించారు.

Another incident happened in the Hyderabad Metro rail

అయితే ప్రస్తుతం మెట్రో నిర్మాణంలో కాకుండా ఏకంగా మెట్రో రైల్ నిర్మాణంలోని భాగాలు ఊడిపడడం మరింత ఆందోళన కల్గిస్తోంది. అత్యంత నమ్మకంగా ప్రయాణికులను గమ్యానికి చేర్చాల్సిన మెట్రో ఇలా ప్రమాదాలకు నిలయాలు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

English summary
Another incident happened on the Hyderabad Metro. The top of the compartment of the train compacted on the passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X