రెండు లోక్ సభ నామినేషన్లు ఓవైసి వద్ద రెండు తుపాకులు
సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురు అయింది..దీంతో తెలంగాణ నుండి మొదటి రోజు రెండు నామినేషన్లు ధాఖలయ్యాయి. అందులో ఒకటి ఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దిన్ ఓవైసి హైద్రబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ ధాఖలు చేశారు. ఇక రెండవ నామినేషన్ ను కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ వేశారు..
ఈ నేపథ్యంలోనే వారి ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కోన్నారు..ఎన్నికల సంఘానికి ధాఖలు చేసిన ప్రమాణ ప్రత్రంలో అసదుద్దిన్ ఓవైసి వద్ద రెండు తుపాకులు ఉన్నట్టు పేర్కోన్నారు.వాటి విలువ ఒక్కోదానికి లక్ష రుపాయల విలువగా పేర్కోన్నారు. వీటితోపాటు ఆయన కుటుంభానికి రూ 17 కోట్ల 84 లక్షల రుపాయల ఆస్తులున్నట్టు తెలిపారు.కాగా 12 కోట్ల 5 అయిదు లక్షల అప్పు సైతం ఉన్నట్టు ఆయన ఆఫిడవిట్ లో పేర్కోన్నారు..
అయితే 2014 ఎన్నికల్లో మాత్రం ఆయన ఆస్తుల విలువ 3 కోట్ల, 94 లక్షలు రుపాయలుగా తెలిపారు. ఇక కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఆస్తులు12 కోట్ల 18 లక్షల రుపాయలు ఉన్నట్టు తెలపగా, గత ఎన్నికల్లో చూపించిన ఆస్థి విలువ 9 కోట్ల 67 లక్షలుగా పేర్కోన్నారు,