కేటీఆర్ మళ్లీ మంత్రి కావాలని ఎదురుచూస్తున్నాను... అసదుద్దిన్ ఓవైసీ
టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మరోసారి మంత్రి కావాలని ఎదురు చూస్తున్నట్టు ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దిన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థానంలో నిలబెట్టేందుకు ఆయన ప్రత్యేకంగా కృషి చేశారని కితాబు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్లి మంత్రి పదవి చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందన్న ఓ జర్నలిస్టు ట్వీట్కు ఆయన రీట్వీట్ చేశారు.
కేటీఆర్ హయాంలోనే ఓప్పో, వన్ప్లస్ లాంటీ సంస్థలతో ఇటివల అమేజాన్ సంస్థను కూడ తీసుకువచ్చిన ఘనత కేటీఆర్దని అసదుద్దిన్ పేర్కోన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను మంత్రి పదవిలో కొనసాగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. దీంతో అసదుద్దిన్కు కృతజ్ఝతలు కూడ తెలిపారు.
రెండోసారి అధికమెజారిటీ వచ్చిన తర్వాత కేటీఆర్తో పాటు హరీష్ రావులకు కూడ మంత్రి పదవులు దక్కని విషయం తెలిసిందే.. అయితే కేటీఆర్కు పార్టీ కీలక భాద్యతలను సీఎం కేసీఆర్ అప్పగించడంతో పార్టీ వ్యవహారాలను చూస్తున్నాడు.
అయితే కొద్దిమంత్రినే తన మంత్రివర్గంలోకి తీసుకున్న కేసీఆర్ రానున్న దసరాకు మరోసారి మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలోనే కేటీఆర్తో పాటు మరింత మంది ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు దక్కనున్నాయనే ప్రచారం జరుగుతోంది.