దేశంలో దళితులపై దాడులు శోచనీయం - శాంతిభద్రతలో తెలంగాణ నెం.1: సీఎం కేసీఆర్
దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్న వార్తలు వినడం శోచనీయమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి సమాజం దూరం కావాలని ఆయన ఆకాంక్షించారు. దళితుల మీద దాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఎప్పటికప్పుడు అప్రమత్తతతో మెలగాలని రాష్ట్ర పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో 19ఏళ్ల దళిత బాలిక హత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతోన్నవేళ కేసీఆర్ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
ఒక్కరోజు ప్రధాని: సినిమా కాదు నిజంగా - ఫిన్లాండ్ పీఎంగా 16ఏళ్ల బాలిక - సనా మారిన్ సంచలనం
అభాగ్యుల పట్ల మానవీయంగా..
బలహీనుల
మీద
బలవంతుల
దాడులు
జరగకుండా
కాపాడాల్సిన
బాధ్యత
రాష్ట్ర
పోలీసు
వ్యవస్థకున్నదని
సీఎం
కేసీఆర్
పేర్కొన్నారు.
ఇందులో
భాగంగా
ఉన్నతాధికారుల
దగ్గరనుంచి
కిందిస్థాయి
పోలీసు
వరకు
సమాజంలో
ఒకరిగా
భాగస్వాములు
కావాలని,
చిన్నా
పెద్ద
తేడా
లేకుండా
పౌరులందరికీ
గౌరవాన్ని
ఇస్తూ
ఫ్రెండ్లీ
పోలీసు
స్ఫూర్తిని
పెంచుకోవాల్సిన
అవసరం
ప్రతి
పోలీసుకున్నదన్నారు.
ఆ
క్రమంలో
తమ
దగ్గరికి
రక్షణకోసం
వచ్చిన
అభాగ్యుల
పట్ల
మానవీయ
కోణంలో
మెలగాలని
సీఎం
హితవు
పలికారు.
రేపిస్టు రఘునందన్ రావుకు టికెటా? దుబ్బాక బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు - పార్టీ నుంచి ఫైర్
లా అండ్ ఆర్డర్లో నంబర్1
అభివృద్ధి
పథాన
ముందుకు
సాగుతున్న
తెలంగాణ
రాష్ట్రం,
శాంతిభధ్రతల
పరిరక్షణలో
దేశానికే
ఆదర్శంగా
నిలిచిందని
కేసీఆర్
అన్నారు.
ఆ
దిశగా
పోలీసుల
భాగస్వామ్యాన్ని
అభినందించారు.
తెలంగాణ
ప్రభుత్వం
మహిళల
భధ్రతను
ప్రాధాన్యతాంశంగా
తీసుకుని
పనిచేస్తున్నదని,
పోలీసులు
మహిళా
సంరక్షణ
కోసం
మరింతగా
శ్రమించాల్సిన
అవసరముందన్నారు.
సమాజాన్ని
పీడించే
గంజాయి
వంటి
వాటి
ఉత్పత్తి,
అమ్మకం,
రవాణా
వ్యవస్థలను
అరికట్టాలన్నారు.
అటవీ
సంపదను
కొల్లగొట్టే
వారిపట్ల
మరింత
కఠినంగా
వ్యవహరించాలని
సీఎం
ఆదేశించారు.
కలప
స్మగ్లింగును
గత
పాలకులు
సరిగ్గా
పట్టించుకోక
పోవడం
వల్ల
కొందరికి
అలుసుగా
మారిందని,
ఐతే
దీన్ని
తెలంగాణ
ప్రభుత్వం
సీరియస్
గా
తీసుకున్నదని
ముఖ్యమంత్రి
తెలిపారు.
గుడుంబా రహిత తెలంగాణ
తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులు సాధించిన ఘన విజయాల్లో గుడుంబా నిర్మూలన కూడా వుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవలి కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ గుడుంబా తయారీ జరుగుతున్నట్టు సమాచారముందని, దాన్ని కూడా తక్షణమే అరికట్టాలన్నారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన ఎక్సైజు, సివిల్ పోలీసులు తిరిగి అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకుగాను రాష్ట్ర ఎక్సైజ్ శాఖతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రజలను ఏమార్చే గ్యాంబ్లింగ్ వంటి సామాజిక దురాచారాలను అరికట్టడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పోలీస్ శాఖలో నియామకాలు
రాష్ట్ర
పోలీసు
శాఖలో
కారుణ్య
నియామకాలను
చేపట్టడంలో
ఆలస్యం
తగదని,
డ్యూటీలో
వుంటూ
చనిపోయిన
ఉద్యోగి
వారసులకు,
నిబంధనల
ప్రకారం
కారుణ్య
నియామకానికి
అర్హత
కలిగిన
వారసులకు,
తక్షణమే
ఉద్యోగం
ఇవ్వాలని,
దీనిపై
తక్షణ
కార్యాచరణ
చేపట్టాలని
సీఎం
కేసీఆర్
ఆదేశించారు.
ఇతర
శాఖల్లో
ఖాళీలుంటే
పరిశీలించి
వెయిటింగ్
లిస్టులో
వున్న
అభ్యర్థులకు
ఉద్యోగాలు
అందేలా
చూడాలని
డీజీపీ
మహేందర్
రెడ్డికి
సీఎం
సూచించారు.
పోలీసు
ఉద్యోగ
నియామకాల్లో
మహిళల
కోసం
33శాతం
రిజర్వేషన్లను
అమలు
పరుస్తున్న
నేపథ్యంలో,ఆ
శాఖలో
మహిళా
ఉద్యోగుల
సంఖ్య
క్రమక్రమంగా
పెరుగుతున్నదన్నారు.
సిటీలో మిలియన్ కెమెరాలు
హైదరాబాద్ నగరంలో పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు. పోలీసు వ్యవస్థలో ఐటీ పాత్రను పెంచి నేరాలను అరికట్టడంలొ సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకోవాలన్నారు దేశానికే తలమానికంగా హైదరాబాద్ లో నిర్మితమౌతున్న పోలీసు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యవస్థీకృత నేరాలమీద ఉక్కుపాదం మోపాలన్నారు.