హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Ayodhya verdict:తీర్పుపై అసంతృప్తి...5 ఎకరాల భూమి విరాళమా ! వద్దన్న అసదుద్దీన్ ఓవైసీ

|
Google Oneindia TeluguNews

అయోధ్య వివాదంపై ఎట్టకేలకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెలువరించింది. సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రామ్‌జన్మభూమి అంశంపై ముస్లిం పర్సనల్‌ లాబోర్డు స్పందించింది. ఒకింత అసహనం వ్యక్తం చేసింది. ఇక ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Ayodhya verdict : శాంతి, గౌరవం మరింత వ్యాప్తి చెందాలి .. ట్వీట్ చేసిన మంచు లక్ష్మిAyodhya verdict : శాంతి, గౌరవం మరింత వ్యాప్తి చెందాలి .. ట్వీట్ చేసిన మంచు లక్ష్మి

అయోధ్య తీర్పు పై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తి

అయోధ్య తీర్పు పై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తి

వివాదాస్పద భూమిని రామ జన్మభూమి న్యాస్‌కు అప్పగించడంపై లాబోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు ఆమోదయోగ్యం కాని విషయాలు చాలా ఉన్నాయని పేర్కొంది. న్యాయస్థానం పేర్కొన్నట్లు పదిహేనో శతాబ్దానికి ముందు ఆధారాలుఉంటే ఆ తర్వాత కాలానికి చెందిన చారిత్రక ఆధారాలు కూడా ఉంటాయి కదా? అని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రశ్నించింది.

తమ అభ్యంతరాలను కూడా మరోసారి పరిశీలించాలని విజ్ఞప్తి

తమ అభ్యంతరాలను కూడా మరోసారి పరిశీలించాలని విజ్ఞప్తి

కోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్తూనే తమ అభ్యంతరాలను కూడా మరోసారి పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపింది. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, చర్చ జరిగిన అనంతరం న్యాయపరంగా ఎలాంటి అడుగు వేయాలన్నది నిర్ణయిస్తామని తెలిపారు. అయోధ్య వివాదం పై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు ముస్లిం పర్సనల్ లా బోర్డు బాధ్యులు.

కీలక వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ

కీలక వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ

ఇక ఇదే సమయంలో అయోధ్య తీర్పు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. కోర్టు ఇచ్చిన తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని ఆయన పేర్కొన్నారు సుప్రీం కోర్టు నిజంగా సుప్రీం కానీ తప్పు చెయ్యదు అని కాదు అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక అంతే కాదు రాజ్యాంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తమ హక్కుల కోసం కచ్చితంగా పోరాడతామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.

భూమి కోసం యాచించలేదని వ్యాఖ్య .. హక్కు కోసమే పోరాటం అన్న ఓవైసీ

భూమి కోసం యాచించలేదని వ్యాఖ్య .. హక్కు కోసమే పోరాటం అన్న ఓవైసీ

ఐదెకరాల భూమిని విరాళంగా తమకు అవసరం లేదని ఈ ఐదు ఎకరాల భూమి తమను ఏమాత్రం ఉద్ధరించలేదని అసదుద్దీన్ ఓవైసీ అసహనం వ్యక్తం చేశారు. మేము భూమికోసం యాచించ లేదంటూ పేర్కొన్న ఆయన భారతదేశంలో ఉన్న ముస్లింలు మసీదుకు ఐదెకరాల భూమిని పొందలేని అణగారిన వర్గాల వారు కాదు అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

English summary
Asaduddin Owaisi respondend on the ayodhya verdict . He was Not satisfied with the verdict. Supreme Court is indeed supreme but not infallible. We have full faith in the constitution, we were fighting for our right, we don't need 5 acre land as donation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X