హీరో బాలకృష్ణ సతీమణి సంతకం ఫోర్జరీ.. చేసింది ఎవరో తెలిస్తే షాక్ !!
తెలుగు రాష్ట్రాల్లో ఫోర్జరీ రాయుళ్ళు పెరిగిపోయారు. ప్రముఖుల సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమ సంపాదనకు తెరతీసిన వైట్ కాలర్ నేరస్తులపై ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతుంది . మొన్నటికి మొన్న తన సంతకాన్ని, తన లెటర్ హెడ్ ను ఫోర్జరీ చేశారని ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత హోం మంత్రికి , డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదుతో ఒక టీడీపీ నేతపై కేసు నమోదు చేస్తే ఇక ఏపీ సీఎం జగన్ సతీమణి వై ఎస్ భారతి పీఏ అని చెప్పి మోసం చేసిన కేటుగాడిపై కేసు నమోదు చేశారు పోలీసులు . ఇక తాజాగా ఫోర్జరీ రాయుళ్ళ ఎఫెక్ట్ హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలయ్య కు తాకింది.
వైసీపీ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి అడ్డంగా దొరికిన టీడీపీ నేత: అరెస్ట్ చేసిన పోలీసులు
వసుంధర సంతకం ఫోర్జరీ చేసి ప్రైవేట్ బ్యాంక్లో మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కు అప్లై
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆమె ఖాతాలో డబ్బు కాజెయ్యాలని ప్లాన్ చేసిన ఓ వ్యక్తి పై పోలీసులు సైబర్ క్రైం క్రింద కేసు నమోదు చేశారు. బాలయ్య సతీమణి వసుంధరకు సంబంధించి ఫోర్జరీ సంతకంతో ఓ ప్రైవేట్ బ్యాంక్లో మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కు అప్లై చేశాడు సదరు కేటుగాడు. ఇక దీనికి సంబంధించి తమకు ఏం సంబంధం లేదని వసుంధర చెప్పటంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
బంజారా హిల్స్ శాఖలో మేనేజర్ కాల్ తో విషయం వెలుగులోకి
ఇక అసలు విషయానికి వస్తే బంజారాహిల్స్లో ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఎమ్మెల్యే బాలకష్ణ సతీమణి వసుంధర మొబైల్ బ్యాంకింగ్ కి అప్లై చేశారని తెలిసి ఈ నెల 13న వసుంధరకు ఆ విషయం కన్ఫార్మ్ చేసుకోటానికి ఫోన్ చేశారు. అందులో వసుంధర మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపిన వారు, అకౌంట్ నంబర్ కూడా చెప్పి అకౌంట్ను యాక్టివేట్ చేయమంటారా? అంటూ ప్రశ్నించారు.
తను ఏ మొబైల్ బ్యాంకింగ్ కోసం అప్లై చెయ్యలేదని చెప్పిన వసుంధర
అయితే తాము ఏ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇవ్వలేదని, అసలు దరఖాస్తే చేసుకోలేదని బాలయ్య సతీమణి వసుంధర తెలిపారు. తనకు సంబంధించి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇవ్వలేదని వసుంధర స్పష్టం చేసింది. దీంతో బ్యాంకు అధికారులు ఈ విషయంపై ఆరా తీశారు. కొత్తగా వచ్చిన బ్యాంకులో పని చేస్తున్న కొర్రి శివ అనే అకౌంటెంట్ ఈ చర్యకు పాల్పడినట్టు గుర్తించారు. డబ్బుల కోసం కక్కుర్తి పడిన సదరు అకౌంటెంట్ ఈ పని చేసినట్టు గుర్తించారు.
ప్రముఖులను టెన్షన్ పెడుతున్న ఫోర్జరీ రాయుళ్ళు
దీనిపై అతడిని నిలదీయగా మొబైల్ బ్యాంకింగ్ కోసం తాను ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అంగీకరించినట్టు తెలుస్తుంది. దీంతో వసుంధరకు సంబంధించిన లావాదేవీలు చూసే మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ అకౌంటెంట్పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల డిజిటల్ చెల్లింపుల నేపధ్యంలో వీళ్ళు , వాళ్ళు అన్న తేడా లేకుండా ఎవరి మీద అయినా సరే సైబర్ నేరగాళ్ళు చెలరేగిపోతున్నారు. ఫోర్జరీ రాయుళ్ళు ప్రముఖులను టెన్షన్ పెడుతున్నారు .