విజయనగరం కాదని నిరూపించు.. కేసీఆర్కు బండి సంజయ్ సవాల్
సీఎం కేసీఆర్ స్థానికత అంశం మరోసారి చర్చకు వచ్చింది. విజయనగరం కాదని నిరూపించు అని బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే టైం.. ప్లేస్.. డిసైడ్ చేయాలని కోరారు. ఈ అంశంపై చర్చకు తాను సిద్దం అని తెలిపారు. ఎక్కడినుంచో వచ్చి.. ఇక్కడ రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని ఇంతకుముందు కూడా తాను చెప్పానని వివరించారు.
ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటారో అక్కడ నుంచే మళ్లీ పాదయాత్ర చేస్తానని బండి సంజయ్ చెప్పారు. తన యాత్ర ఆగదు, ఆగబోదని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పలు పథకాలకు కేంద్రం నిధులిస్తోందని బండి సంజయ్ గుర్తుచేశారు. పెద్దోళ్ల గడీలు బద్దలు కొడతామని పేదోళ్లకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. పాతబస్తీలో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటే ఊరుకోమని బండి సంజయ్ హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రంలో చేరికల పర్వం కొనసాగుతోంది. ఎన్నికలకు సమయం ఉన్నా.. ఇప్పటికే పార్టీలు మారే నేతలు మారుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం పెద్ద మైనస్ అయ్యింది. ఆయన 21వ తేదీన బీజేపీలో చేరునున్నారు. ఇదివరకు దాసోజు శ్రావణ్ బీజేపీలో చేరారు.