హాట్ టాపిక్గా బండి సంజయ్ కామెంట్స్.. సినిమాలో డైలాగుల్లా జనం మదిలో..
గ్రేటర్ ప్రచారం జోరుగా సాగుతోంది. నేతల మధ్య కామెంట్లు పీక్కి చేరాయి. బీజేపీ చీఫ్ బండి సంజయ్ నోట భారీ డైలాగ్లు వస్తున్నాయి. ఆయన చేసే ప్రతీ డైలాగ్ పేలుతోంది. పంచ్ డైలాగ్లతో హీట్ పుట్టిస్తున్నారు. డైలాగ్ వేస్తే పేలాల్సిందే అన్నట్లుగా సంజయ్ సెగలు పుట్టిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో రోజు ఒక్కో డైలాగ్తో క్యాంపెయిన్ను తనవైపు తిప్పుకున్నారు సంజయ్.
సీఎం కేసీఆర్ గంట మాట్లాడి గ్రేటర్ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. నగరవాసులకు నీళ్లు ఫ్రీ అంటూ ఇచ్చిన మేనిఫెస్టోపై చర్చ జరుగుతుంది. ఇంతలో బండి సంజయ్ సర్జికల్ స్ట్రయిక్ వ్యాఖ్యలతో మొత్తం దృష్టి మారిపోయింది. మంత్రి కేటీఆర్ స్పీచ్, సీఎం కేసీఆర్ ఇచ్చిన వరాలన్నీ సర్జికల్ స్ట్రయిక్ కామెంట్ల ముందు దిగదుడుపే అయ్యాయి.
గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పీఠం దక్కించుకుంటే పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రయిక్ చేసి పాకిస్థానీలు, రోహింగ్యాలను తరమితరిమి కొట్టే బాధ్యతను బీజేపీ తీసుకుంటుంది అని బండి సంజయ్ హెచ్చరించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ పోరాడుతుందని నొక్కి వక్కానించారు. జనాభాలో 80 శాతం ఉన్న ప్రజల మనోభావాలు, సంక్షేమం కోసం పాటుపడుతుందని ర్కొన్నారు. ముస్లిం ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్న వాళ్లు లౌకికవాదులు ఎలా అవుతారని ప్రశ్నించారు.
గ్రేటర్ ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకెళుతోంది. కేటీఆర్, కేసీఆర్ హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటు బీజేపీ నేతలు కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం జనాలను ఆలోచింపజేస్తున్నాయి. ఒక్కసారిగా జనాల ముందు సంజయ్ హీరోగా మారిపోయారు. హిందూత్వ.. పాకిస్తాన్ ఎజెండాగా విమర్శలు గుప్పిస్తూ.. ఓటర్ల నాడీని పట్టేశారు. అయితే అవీ ఓట్ల రూపంలో మలుస్తాయో లేదో చూడాలీ.