హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నైట్ టైం సీఎం కేసీఆర్.. బండి సంజయ్ నిప్పులు

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్‌‌పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఆయన నైట్ టైం సీఎంలా మారారని మండిపడ్డారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఉండటం.. అర్ధరాత్రి జీవోలు జారీచేయడం ఇదే పని అని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియా రెచ్చిపోతుందని.. వారికి అధికార పార్టీ అండ దండలు ఉన్నాయని చెప్పారు. అర్థరాత్రి జీవోలు విడుదల చేసే నైట్ టైం సీఎం కేసీఆర్ అని అన్నారు. నిజామాబాద్‌లో ఇసుక మాఫియా చేతిలో గాయపడి సికింద్రాబాద్ సన్ షైన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

Recommended Video

Telangana : పెద్దపల్లి జిల్లా కి Bandi Sanjay పర్యటన
 bandi sanjay slams cm kcr

ఇసుక మాఫియా చేతిలో గాయపడ్డ విజయ్‌ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఇంతవరకు అతీ గతీ లేదన్నారు. ఒక కాలు పోవడంతో ఆ కుటుంబం దీనస్థితికి చేరిందని వివరించారు. మంగలి పని చేసే ఆయన రోడ్డున పడ్డాడని వివరించారు. కేసీఆర్ అని రాక్షసంగా మారిపోతున్నారు. నిజామాబాద్ లో పోలీసుల చేత పాలిస్తున్నారని ఫైరయ్యారు.

ఒక్క నిజామాబాద్ కాదు.. ఇసుక మాఫియాకు ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతిస్తుందని వివరించారు. అనుమతులు లేకుండా వేల లారీలు తిరుగుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ కనుసనల్లోనే ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయని చెప్పారు.

English summary
bjp state president bandi sanjay visited vijayakumar who is undergoing treatment at secunderabad yashoda hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X