సావిత్రక్కే మొదటి పార్టిసిపెంట్.. జాఫర్ది 4వ స్థానం... బిగ్బాస్లో మీడియా ప్రతినిధుల ఎంట్రీ
హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్-3 రానే వచ్చేసింది. ఈసారి హోస్ట్గా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవహారిస్తున్నారు. రియాల్టీ షోకు మరింత హైప్ తీసుకొస్తూ .. ఇంట్రోనే ప్రకృతిపై చేసి ప్రేక్షకులకు మరింత క్యూరిసిటీ పెంచారు. తర్వాత బిగ్ బాస్ షోను సునీశితంగా పరిశీలించారు. తన మార్క్ చూపిస్తూ .. బిగ్ బాస్తో మాట్లాడారు కింగ్ నాగార్జున. టైమింగ్ డైలాగ్తో .. అదిరే పంచులతో బిగ్ బాస్ కంటెస్టెంట్లను పరిచయం చేశారు. అయితే ఈసారి 15 మంది బిగ్ బాస్ రియాల్టీ షోలో ఆడుతున్నారు.
ఇద్దరి ఎంట్రీ
బిగ్ బాస్లో ఈసారి మీడియా నుంచి ఇద్దరు పార్టిసిపెంట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో ఒకరు సావిత్రి (శివజ్యోతి) కాగా, మరొకరు జాఫర్ ఉన్నారు. శివజ్యోతి అదేనండి సావిత్రక్క. ఓ న్యూస్ చానెల్లో తీన్మార్ వార్తలు చదువుతూ ఫేం అయిన న్యూస్ ప్రజెంటర్. బిత్తిరి సత్తి చేసే అల్లరి, పద్మతో రైమింగ్గా మాట్లాడుతూనే వార్తలు చెప్పి తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు సావిత్రి. షో లోకి రాగానే సావిత్రితో కింగ్ నాగార్జున సరదాగా మాట్లాడారు. అందరిలాగే సావిత్రక్క అనడంతో ఆశ్చర్చపోవడం శివజ్యోతి పనైపోయింది. అలాగే తనతో వచ్చిన భర్తను పరిచయం చేసి .. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిపోయారు సావిత్రి.
నేను జాఫర్ ..
తర్వాత ఇద్దరూ పార్టిసిపెంట్ల తర్వాత నాలుగో వ్యక్తిగా జాఫర్ అడుగుపెట్టారు. జాఫర్ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదెమో. ప్రముఖ తెలుగు టీవీ చానెల్లో ముఖాముఖి, ఇతర కార్యక్రమాలు చేపట్టి మంచి పేరుతెచ్చుకున్నారు. ఇప్పటికే 875 మందిని ఇంటర్వ్యూ చేసి .. చీకటి కోణాల్ని ఆవిష్కరించారు. అలాగే కొన్ని సందర్భాల్లో గెస్ట్ కోపానికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో జాఫర్ .. ఎంట్రీని కూడా బిగ్ బాస్ అదే స్థాయిలో చూపించింది. జాఫర్ రాగానే నాగార్జున .. ఇంటర్వ్యూ చేశారు. తర్వాత ఫ్యామిలీని కింగ్కు పరిచయం చేశారు. లోపలికి వెళ్లాక అక్కడే ఉన్న వారు జాఫర్ను ఇంటర్వ్యూ చేయడంతో బిగ్ బాస్ ఆట మొదలైంది.
వెల్ కం
బిగ్ బాస్ -1 విన్నర్ శివబాలాజీ నటుడు, బిగ్ బాస్-2 కౌశల్ కూడా నటుడిని వరించింది. మరి సీజన్-3లో మీడియాకు చెందిన వారు గెలువాలని అభిప్రాయం కొన్నివర్గాల నుంచి ఉంది. ఇందుకు శివజ్యోతి సరిగ్గా సరిపోతారు. అలాగే అల్లరిగా ఉండే జాఫర్ కూడా ఏమీ తీసిపోరనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో.. ఈ సీజన్లో మీడియాకు చెందిన ఇద్దరు ప్రతినిధుల్లో ఒక్కరు విజయం సాధించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.