లేడీ కాదు కిలేడీ.. విద్యార్థినుల ఫోటోలు తీసి... పోర్న్ వైబ్సైట్లో అప్లోడ్ చేసి....
ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు. డబ్బే పరామావధిగా ప్రవర్తస్తున్నారు. తమకు జాలి, దయ, కరుణ ఏమీ లేదని చేష్టలతో రుజువు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె సాధారణ నేరం చేయలేదు. పిల్లలే దేవుళ్లు అని చెప్పే .. విద్యార్థినుల ఫోటోలను తీసుకుంది. ఫోటోలను తీస్తూనే .. న్యూబ్ వెబ్సైట్లలో అప్లోడ్ చేసింది.
ఈజీ మనీ కోసం
హైదరాబాద్కు చెందిన ఓ యువతి సులభంగా డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచించింది. అనుకున్నదే తడవుగా కార్యాచరణ కూడా ప్రారంభించేసింది. అలా ఆలోచించగా ఆమెకు ఒక ఆలోచన తట్టింది. ప్రైవేట్ స్కూల్ వెబ్సైట్ నుంచి విద్యార్థినుల ఫోటోలు తీసుకోవాలని భావించింది. అలా కార్పొరేట్ స్కూల్ విద్యార్థినుల ఫోటోలు తీసుకున్నది. ఇంతరకు ఓకే .. ఇక్కడ మొదలైంది అసలు కథ.
ఫోటోలు పెట్టుకొని ..
ఆ ఫోటోలు తన వద్ద పెట్టుకుంది. ఒక్కో ఫోటోను పోర్న్ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. తర్వాత మెదడుకు పదునుపెట్టింది. ఆ ఫోటోలను స్కీన్ షాట్ తీసి తిరిగి అదే స్కూల్కు పంపించింది. ఫోటోలు చూసి స్కూల్ మేనేజ్మెంట్ షాక్ తిన్నది. ఏంటీ ఇదీ ? ఇలా ఎలా అని మదనపడింది. ఇంతలో ఆ స్కూల్కు ట్రింగ్ మని ఫోన్ మోగింది. తాను సైబర్ సెక్యూరిటీ నుంచి మాట్లాడుతున్నా అంటూ ఫోన్ చేసింది. విద్యార్థినుల ఫోటోల విషయం అడిగి తెలివిగా వ్యవహరించింది.
నమ్మడంతో ..
అయితే వారికి తెలియకపోవడంతో గుట్టుగా నమ్మారు. ఫోటోలు తీసేస్తామని నమ్మబలికింది. అయితే అందుకు డబ్బులు ఖర్చవుతాయని ముక్కుపిండి నగదు వసూల్ చేసింది. ఆ కిలేడీ లిస్ట్లో చాలా మంది విద్యార్థినులు ఉన్నారు. బాధితుల్లో ప్రముఖ ప్రైవేట్ స్కూల్ విద్యార్థినులు కూడా ఉన్నారు. ఆ మహిళ ఫోన్లో మరో 250 మంది విద్యార్థినుల ఫోటోలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇలా వెలుగులోకి ..
కిలేడీ అరాచకాలపై స్కూల్ యాజమాన్యం బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫోన్ కాల్ ఆధారంగా కిలేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఫోన్ చూసి పోలీసులే ఖంగుతిన్నారు. మహిళ ఫోన్లో 250 మంది విద్యార్థినుల ఫోటోలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆమెను అరెస్ట్ చేసి .. రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.