హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ అంటేనే వంచన.. ఎవరినీ వదల్లేదు, బీజేపీ ఎంపీ అర్వింద్ విమర్శలు

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ ప్రచారం జోరందుకుంది. నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీజేపీ నుంచి బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా వీరి విమర్శలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని అర్వింద్ విమర్శించారు. అదీ చేస్తాం.. ఇదీ చేస్తాం అని చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. ఆయన బుధవారం ఆల్విన్ కాలనీలో రోడ్ షో నిర్వహించారు.

కేసీఆర్ అందరినీ మోసం చేశారని అర్వింద్ ధ్వజమెత్తారు. అందరికంటే ఎక్కువగా పోలీసులను మోసం చేశారని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది కేసీఆరే అని విరుచుకుపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తానని పేద ప్రజలను మోసం చేశారని గుర్తుచేశారు. వరద బాధితులకు రూ.10 వేలు ఇవ్వకుండా మోసం చేశారని పేర్కొన్నారు. అంతేందుకు రాష్ట్రంలో కరోనా వైరస్ కోసం చికిత్స ఆరోగ్య శ్రీ పథకంలో లేదన్నారు.

bjp mp arvind slams cm kcr

Recommended Video

TFC President Narayan Das Narang Thanks To CM KCR ఇండియా ఫిలిం హబ్‌గా హైదరాబాద్..!!

అగ్రవర్ణ పేదలకు ప్రధాని మోడీ రిజర్వేషన్ ఇస్తే.. కేసీఆర్ తీసుకురావడం లేదన్నారు. చివరికీ మీడియా వారికి కూడా ఇళ్లు ఇవ్వలేదన్నారు. ఇప్పటికీ కమీషన్లు ఫౌమ్ హౌస్‌‌కు వెళ్తున్నాయని చెప్పారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌‌లో 30 శాతంగా ఉన్న హిందువుల జనాభా కాస్తా 3 శాతానికి పడిపోయిందన్నారు. కానీ దేశంలో ఇతరులకు సమాన హక్కులను కల్పించడం లేదా అని అడిగారు.

English summary
nizamabad bjp mp dharmapuri arvind slams cm kcr on ghmc polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X