విషాదం: బండ్లగూడలో విరిగిపడ్డ కొండచరియలు, చిన్నారి సహా 8 మంది మృతి..
వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరం తడిసి ముద్దయిపోయింది. అయితే వర్షం వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు బిక్కుబిక్కు మంటున్నారు. వరదనీరు ఎలా అనుకుంటున్న సమయంలో కొండచరియలు వచ్చి వారి ఇంటిపై పడ్డాయి. ఇంకేముంది ఆ ఇంట్లో విషాద వదనం నెలకొంది.
బండ్లగూడ ఏరియాలో ఓ ఫ్యామిలీ ఉంటోంది. వర్షాలకు వారి ఇంటిపై కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో ఇంట్లో ఉన్న 11 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 8 మంది చనిపోయారు. వీరిలో ఒక చిన్నారి ఉన్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని దగ్గరుండి మరీ అధికారులు సమీక్షిస్తున్నారు.
Telangana: 8 persons including a child died while 3 persons have been injured after a boulder fell on their house at Bandlaguda area of Hyderabad, following heavy rainfall in the city. Officials present at the spot.
— ANI (@ANI) October 13, 2020
హైదరాబాద్ చాలా చోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. వనస్థలిపురంలో వర్షపునీరు ఇళ్లకు చేరింది. చాలా చోట్ల వరదనీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Telangana: Water logging in parts of Hyderabad following heavy rainfall in the city; visuals from near Vanasthalipuram area. (13.11) pic.twitter.com/5LQYDt511d
— ANI (@ANI) October 13, 2020