రెండవ బిడ్డకు కనేందుకు ఇష్టపడని చైనీయులు..
హైద్రబాద్ ; ఒక్కేరే చాలు ఇద్దరిని కనలేమంటున్న చైనీయులు, పెరిగిన,విద్యా,వైద్య ఖర్చులు భరించలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని చెబుతున్న నివేదికలు...ఒక్కరినే ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రేండు చేతులా సంపాదించిన సరిపోవడం లేదని భావిస్తున్న పిల్లల తల్లిదండ్రులు..సంపాదించిన దాంట్లో మూడో వంతు పిల్లల చదువుతో పాటు ఇతర ఖర్చులకు సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న మధ్య తరగతి చైనీయులు..దీంతో కనీసం యాబై శాతం మధ్యతరగతి కుటుంభాలు రెండవ బిడ్డను కనడానికి వెనకడుగు వేస్తున్నారు...
చైనా ప్రభుత్వం రానున్న 2030 సంవత్సరం వరకు ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలనే లక్ష్యంలో ముందుకు సాగుతోంది... అ విధంగా అక్కడి కమ్యునిస్టు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది..అయితే ఇందు కోసం మానవవనరుల అవసరం ఉంటుందని ముందే గ్రహించింది..ఇందుకు అనుగుణంగానే పిల్లల విషయంలో ప్రభుత్వ విధానాలను మార్చింది.. అక్కడ సింగిల్ చైల్డ్ విధానాన్ని సడలిస్తూ ..సెకండ్ చైల్డ్ పాలసీని తీసుకువచ్చింది....రెండవ కాన్పువారికి కోంత ఆర్ధిక సహయం అందించేందుకు ముందుకు వచ్చింది..బిడ్డ పోషణ కోసం ఆర్డిక వరాలు ప్రకటించింది ..దీనికి తోడు స్త్రిల ఉద్యోగ విధానంలో కూడ మార్పులు తీసుకువచ్చింది...బిడ్డను కనాలనుకునేవారికి ఉచిత ప్రసవ ఖర్చులతోపాటు 1200 యువాన్లను కూడ ప్రకటించింది..
అయినా బర్త్ రేట్ లో పెరుగుదల లేదు...ప్రభుత్వ లక్ష్యాలకు విరుద్దంగా జనాభా పెరుగుదల ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తూంది..2018లో సంవత్సరంలో చైన జనన రేటు 17.13 మిలియన్లు ఉండగా,2018 లో 15 మిలియన్లుగా నమోదయి పెరుగుదల రేటు తగ్గింది...
ప్రధానంగా చైనా ప్రభుత్వం తీసుకువచ్చే ప్రభుత్వ పిల్లల ఉత్పత్తుల్లో నాణ్యత లేకపోవడం,దీంతో విదేశీ వస్తువులపై ఆధారపడి జీవించవల్సి వస్తుందని కుటుంభీకులు తెలుపుతున్నారు..దీనికి తోడు తమ పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వంరంగ విద్య నుండి ప్రైవేటు రంగం వైపు కు మల్లుతున్నారు.. పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించేందుకు ప్రైవేటు స్కేూళ్ల వైపుకు పరుగులు పెడుతున్నట్టు తెలుస్తోంది..దీంతో చదువు భారంతోపాటు పిల్లల కాస్మోటిక్స్..దుస్తులు వంటి వాటి కోసం విదేశీ కంపనీలపై అధారపడుతుండడంతో ఖర్ఛులు పెరుగుతున్నాయని చెబుతున్నారు...
ఇక ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో వ్రుద్దుల సంఖ్య 50 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి...దీంతో ప్రస్థుతం ఉన్న జనాభా పరంగా రానున్న 2050 సంవత్సరం వరకు 48 కోట్ల మంది వరకు పెరిగే అవకాశం ఉంది.ఇలా అయితే ప్రపంచలో పట్టు బిగించాలని భావిస్తున్న చైనా కోంత మానవ వనరుల కోసం ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోకోక తప్పదు..