కష్టపడేవారికే సీఎల్పీ పదవి ఇవ్వాలి..! లాబీయింగ్ ఒద్దంటున్న జగ్గారెడ్డి..!!
హైదరాబాద్: కాంగ్రెస్ లో కష్టపడేవారిని గుర్తించాల్సిన అవసరం రాహుల్ గాంధీ కి ఉందని, లేకుంటే భవిష్యత్ అంధకారమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ లో లాబీయింగ్ వ్యవస్థకు స్వస్తి పలకాలని, ఢిల్లీ లో లాబీయింగ్ చేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణ లో పార్టీ కోసం కష్టపడేవారికి గుర్తింపు కరువౌతోందని ఆరోపించారు. కులాలకు, మతాలకు సంబంధం లేకుండా సమర్దుడిని కి బాధ్యతలు అప్పజెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసారు. ప్రజలు ఎవరిని, ఏ నాయకత్వాన్ని కోరుకుంటారో వారికి ప్రాధాన్యత ఇస్తే అనుకూల ఫలితాలు వస్తాయని అన్నరు.
లాబీయింగ్ ద్వారా సీఎల్పీ పదవికి ఎంపిక చేస్తే పార్టీ పరిస్థితి మరింత అదఃపాతాళానికి వెళ్తుందని అన్నారు. రహస్య సర్వే ద్వారా ప్రజల అభిప్రాయం తీసుకొని సీఎల్పీ నేత ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. వరుస గా రెండు ఏన్నికల్లో గజ్వేల్ లో వంటేరు ప్రతాప్ రెడ్డి పోరాడారని, ఆర్దికంగా బాగా నష్టపోయాడని జగ్గారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పైన, టీఆర్ఏస్ పార్టీ పై పోరాడడంతో ఆయనపై అనేక అక్రమ కేసులు నమోదు అయ్యాయన్నారు. వంటేరు పార్టీ మారడాన్ని వ్యక్తిగతంగా సమర్ధిస్తానని జగ్గారెడ్డి అన్నారు.