గ్రేటర్లో తగ్గుముఖం, జిల్లాల్లో పెరుగుతోన్న వైరస్.. 57 వేల మార్క్కి చేరిన కరోనా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం కొత్తగా 1610 మందికి కరోనా వైరస్ వచ్చింది. ఆదివారం 1473 పాజిటివ్ కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుమఖం పట్టాయి. ఆదివారం 506 పాజిటివ్ కేసులు రాగా... సోమవారం కాస్త పెరిగి 531 వచ్చాయి. అంతకుముందు రోజుకు వెయ్యి వరకు కూడా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పాజిటివ్ కేసులు జిల్లాలకు పాకాయి.
కరోనా కట్టడికి జగన్కు చంద్రబాబు సలహాలు- ట్విట్టర్ వీడియో ద్వారా డిమాండ్లు..
1610 పాజిటివ్ కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 57,142కు చేరింది. నిన్న వైరస్ సోకిన 9 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 480కి చేరుకుంది. కరోనా వైరస్ తగ్గడంతో 803 డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 42,909కి చేరింది. రాష్ట్రంలో 13,753 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గ్రేటర్ తర్వాత అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 340 కరోనా పాజిటివ్ కేసలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 172, వరంగల్ అర్బన్ 152, మేడ్చల్ మల్కాజిగిరిలో 113 చొప్పున సెంచరీ మార్క్ దాటి కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో 48 చొప్పున, సూర్యాపేటలో 35, ములుగులో 32, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 26, మహబూబ్నగర్లో 23 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3,79,081 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇంకా 809 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది.